News October 6, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. కాంగ్రెస్ టికెట్ దక్కేదెవరికి?

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరికి ఇస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏఐసీసీకి పీసీసీ ముగ్గురి పేర్లను సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఆ లిస్టులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, CN రెడ్డి పేర్లు ఉన్నట్లు సమాచారం. అయితే పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరి వీరిలో ఎవరు ఉపఎన్నిక బరిలో నిలుస్తారో చూడాలి.
Similar News
News October 6, 2025
UPI పిన్ మర్చిపోయారా? ఇలా చేయండి 2/2

చాలా మంది UPI పిన్ను మర్చిపోయి పేమెంట్స్ చేసే సమయంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో మీ UPI యాప్లో “Forgot UPI PIN” అనే ఆప్షన్ను ఎంచుకోండి. మీ డెబిట్ కార్డు వివరాలను (చివరి 6 అంకెలు, గడువు తేదీ) ఉపయోగించి కొత్త పిన్ను సెట్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు UPI పిన్ను లేదా OTPని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. UPI యాప్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి.
News October 6, 2025
UPI లావాదేవీల్లో సమస్యలొస్తే ఇలా చేయండి1/2

క్యాష్లెస్ పేమెంట్స్ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈక్రమంలో UPI, ఆన్లైన్ పేమెంట్స్లో సమస్యలెదురైతే ఇలా చేయండి. డబ్బు పంపే సమయంలో మన అకౌంట్లో డెబిట్ అయినా అవతలి వారికి చేరదు. ఇంటర్-బ్యాంక్ సర్వర్ల మధ్య కమ్యూనికేషన్ లోపం వల్ల ఇలా జరగొచ్చు. 3 రోజుల్లో డబ్బు తిరిగి రాకపోతే మీరు వాడిన <<17922440>>UPI<<>> యాప్ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. లేదా NPCI పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వాలి. SHARE IT
News October 6, 2025
బీసీ రిజర్వేషన్ల జీవోపై సుప్రీం స్టే విధిస్తే?

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో-9పై సుప్రీంలో కాసేపట్లో విచారణ జరగనుంది. ప్రభుత్వం తరఫున లాయర్లు సింఘ్వీ, దవే వాదనలు వినిపించనున్నారు. అటు ఈ జీవో పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కు విరుద్ధమని పిటిషనర్ గోపాల్రెడ్డి వాదిస్తున్నారు. దీంతో జీవోపై SC స్టే విధిస్తే ఎన్నికలకు బ్రేక్ పడుతుందా? లేక సర్కార్ ముందుకే వెళ్తుందా? అనేది ఉత్కంఠగా మారింది.