News October 6, 2025
ఇంద్రకీలాద్రికి 20 లక్షల మంది భక్తులు

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై గత 14 రోజుల్లో 20 లక్షల మంది దుర్గమ్మను దర్శించుకున్నట్లు ఆలయ ఈవో వీకే శీనానాయక్ తెలిపారు. గత నెల 22 నుంచి ఈ నెల 2 వరకు 15.90 లక్షల మంది, దసరా ఉత్సవాల అనంతరం 3, 4, 5 తేదీల్లో 4 లక్షల మందికి పైగా అమ్మవారి దర్శనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇవాళ్టి నుంచి ఘాట్ రోడ్డులోకి వాహనాలను అనుమతించనున్నట్లు తెలిపారు. ఆలయ హుండీలను నేటి నుంచి 3 రోజులపాటు లెక్కించనున్నారు.
Similar News
News October 6, 2025
బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఇలా చెయ్యండి

మారిన జీవనశైలి వల్ల మహిళల్లో బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతోంది. దీనివల్ల డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువంటున్నారు న్యూట్రిషనిస్ట్ లహరి సూరపనేని. దీనికోసం ఆహారంలో మైదా, స్వీట్స్, జంక్ ఫుడ్ తగ్గించడం, ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. క్రమంతప్పని వ్యాయామం, మంచి నిద్రతో ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ స్ట్రెస్ తగ్గించుకోవాలని చెబుతున్నారు.
News October 6, 2025
UPI పిన్ మర్చిపోయారా? ఇలా చేయండి 2/2

చాలా మంది UPI పిన్ను మర్చిపోయి పేమెంట్స్ చేసే సమయంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో మీ UPI యాప్లో “Forgot UPI PIN” అనే ఆప్షన్ను ఎంచుకోండి. మీ డెబిట్ కార్డు వివరాలను (చివరి 6 అంకెలు, గడువు తేదీ) ఉపయోగించి కొత్త పిన్ను సెట్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు UPI పిన్ను లేదా OTPని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. UPI యాప్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి.
News October 6, 2025
UPI లావాదేవీల్లో సమస్యలొస్తే ఇలా చేయండి1/2

క్యాష్లెస్ పేమెంట్స్ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈక్రమంలో UPI, ఆన్లైన్ పేమెంట్స్లో సమస్యలెదురైతే ఇలా చేయండి. డబ్బు పంపే సమయంలో మన అకౌంట్లో డెబిట్ అయినా అవతలి వారికి చేరదు. ఇంటర్-బ్యాంక్ సర్వర్ల మధ్య కమ్యూనికేషన్ లోపం వల్ల ఇలా జరగొచ్చు. 3 రోజుల్లో డబ్బు తిరిగి రాకపోతే మీరు వాడిన <<17922440>>UPI<<>> యాప్ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. లేదా NPCI పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వాలి. SHARE IT