News October 6, 2025
ఉమ్మడి విశాఖలో 75 మందికి పదోన్నతులు

ఉమ్మడి విశాఖ జిల్లాలో 75 మంది తెలుగు, ముగ్గురు హిందీ భాష పండితులకు పదోన్నతులు లభించాయి. చివరిగా 2019లో కొందరికి పదోన్నతులు కల్పించి మిగిలిన వారిని డీఈఓ పూల్లో ఉంచారు. డీఈఓ పూల్లో ఉన్న 75 మంది భాష పండితులకు అడహక్ బేసిక్ ప్రాతిపదికన పదోన్నతులు కల్పిస్తూ విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయం చేసిన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్కు వీరు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News October 6, 2025
నకిలీ మద్యం ఎక్కడ విక్రయించారు..

మొలకలచెరువులో నకిలీ మద్యంను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎంత కాలంగా నకిలీ తయారు చేసి ఎక్కడ ఎక్కడ విక్రయించారనేది విచారణ చేస్తున్నారు. నకిలీ మద్యం అమ్మకాలు చేసిన ఓ డైరీ పోలీసులకు లభించిందని ప్రచారం జరుగుతోంది. త్వరలో దీనిపై మారిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు నుంచి సమాచారం.
News October 6, 2025
ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్న హీరో

‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ఒకే రోజు రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆయన నటించిన డ్యూడ్, lik(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) ఈ నెల 17న రిలీజ్ కానున్నాయి. దీంతో ఈ తరం హీరోల్లో ‘నాని’ తర్వాత ఒకే రోజు రెండు సినిమాలు విడుదల చేయనున్న హీరోగా ప్రదీప్ రికార్డులకెక్కనున్నారు. గతంలో నాని ‘జెండాపై కపిరాజు’, ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రాలు ఒకే రోజు(2015 మార్చి 21) థియేటర్లలో రిలీజయ్యాయి.
News October 6, 2025
శాంతించిన వంశధార..!

ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వంశధారకు వరద పోటెత్తింది. ఒకానొక సమయంలో లక్ష క్యూసెక్యలకు పైగా నీరు నదిలో ప్రవహించింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నది శాంతించింది. సోమవారం ఉదయం 6 గంటలకు వంశధారలో 29,224 క్యూసెక్కులకు నీటి ప్రవాహం తగ్గింది. గొట్టా బ్యారేజీ 22 గేట్లను కాస్త లిఫ్ చేసి దిగువ ప్రాంతానికి నీరు విడిచి పెడుతున్నట్లు వంశధార డీఈ సరస్వతి వెల్లడించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో ప్రవాహం లేదు.