News October 6, 2025
నిర్మల్: బతుకమ్మ ఆడుతూ మహిళ మృతి

నిర్మల్ జిల్లాలో జరిగిన బతుకమ్మ వేడుకలు విషాదాన్ని నింపాయి. బతుకమ్మ కోసం వినియోగించిన డీజే కారణంగా బంగల్ పేట్కు చెందిన భాగ్యలక్ష్మి (56) గుండెపోటుతో మరణించారు. శనివారం రాత్రి డీజే శబ్దాల మధ్య బతుకమ్మ ఆడుతూ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స నిర్వహిస్తుండగానే మృతి చెందారు. డీజే సౌండ్ కారణంగా గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు.
Similar News
News March 16, 2026
భద్రాద్రి: రైల్వే లైన్తో పర్యాటక రంగానికి ప్రోత్సాహం

భద్రాద్రి అభివృద్ధికి కీలకమైన పాండురంగాపురం మల్కాన్గిరి రైల్వే లైన్కు అనుమతి లభించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో సారపాక వరకు భూ సేకరణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్కు సూచించారు. ఈ రైల్వే లైన్ పూర్తయితే దక్షణ అయోధ్యగా ఉన్న భద్రాద్రి ప్రాంతంలో సాంస్కృతిక శోభ వెల్లి విరుస్తుందని, పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.
News March 16, 2026
కొత్తగూడెం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి స్థలం గుర్తించండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 చోట్ల విమానాశ్రయాలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆ ప్రాంతాలను తిరస్కరించిందని, భద్రాచలం, కొత్తగూడెం, మధ్య ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుకూలమైన భూమిని గుర్తించాలని కలెక్టర్ అంకిత్ను ఆదేశించారు. దీనిపై సంబంధిత శాఖలు సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.
News March 16, 2026
బీఆర్ఎస్ నేతలతో జీవన్ రెడ్డి చర్చలు

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశాలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో జరిగిన ఈ చర్చల తరువాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో చర్చలు జరిగినట్లు సమాచారం.


