News October 6, 2025

బంగారుపాళ్యం: ఐచర్ ఢీకొని వృద్ధురాలు మృతి

image

బెంగళూరు- చెన్నై జాతీయ రహదారి కేజీ సత్రం సమీపంలో ఐచర్ వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. సోమవారం ఉదయం కమ్మరపల్లి గ్రామానికి చెందిన మునస్వామి భార్య రాజమ్మ రోడ్డు దాటుతున్న సమయంలో బెంగళూరు వైపు నుంచి చిత్తూరు వైపు వస్తున్న ఐచర్ వాహనం ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు అంబులెన్స్‌లో ప్రభుత్వాస్పతికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ఆమె మృతి చెందింది.

Similar News

News October 6, 2025

రేపు అధికారికంగా వాల్మీకి జయంతి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 7న వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం తెలిపారు. రేపు జిల్లా సచివాలయంలోని వివేకానంద భవన్‌లో ఉ.10.30 గం.లకు మహర్షి వాల్మీకి చిత్రపటానికి అంజలి ఘటించడం జరుగుతుందన్నారు. అధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు.

News October 6, 2025

నకిలీ మద్యం ఎక్కడ విక్రయించారు..

image

మొలకలచెరువులో నకిలీ మద్యంను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎంత కాలంగా నకిలీ తయారు చేసి ఎక్కడ ఎక్కడ విక్రయించారనేది విచారణ చేస్తున్నారు. నకిలీ మద్యం అమ్మకాలు చేసిన ఓ డైరీ పోలీసులకు లభించిందని ప్రచారం జరుగుతోంది. త్వరలో దీనిపై మారిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు నుంచి సమాచారం.

News October 6, 2025

జయచంద్ర రెడ్డి చుట్టూ అన్నీ వివాదాలే..?

image

MLA అభ్యర్థిగా జయచంద్రా రెడ్డి ఎన్నికైన నాటి నుంచి అనేక వివాదాలు చుట్టుముట్టాయి. జయచంద్ర రెడ్డి TDP బీ ఫార్మ్ తీసుకోవడంతో శంకర్ యాదవ్ వర్గీయులు తీవ్ర ఆందోళనలు దిగారు. ఎన్నికల టైంలో పోలింగ్ బూతుల్లో ఏజంట్లను నియమించుకోలేక పోయారని వాదన ఉంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబానికి సహకారం అందిస్తున్నట్లు గతంలో తెలుగు తమ్ముళ్లు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.