News October 6, 2025
పెగడపల్లి: స్థానిక ఎన్నికలపై ఆశావహుల్లో ఉత్కంఠ

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాటు చేస్తుండగా, మరోవైపు కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందోనని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుండగా, ఈ నెల 8న హైకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై జడ్జిమెంట్ ఎలా వస్తుందో మరి.
Similar News
News March 25, 2026
తిరుపతి జిల్లాలో 246 మంది డుమ్మా

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 10వ తరగతి భౌతిక శాస్త్రం పరీక్ష జరిగింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 27,068 మంది విద్యార్థులకు గాను 26,822 మంది హాజరుకాగా 246 మంది గైర్హాజరైనట్లు DEO KVN కుమార్ తెలిపారు. ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి పరీక్షలకు సంబంధించి 839 మందికి గాను 732 మంది హాజరై 107 మంది గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్లు ఆయన అన్నారు.
News March 25, 2026
ఏలూరు: భద్రాచలం రామయ్య దర్శనానికి ప్రత్యేక బస్సులు

శ్రీరామనవమి పురస్కరించుకుని ఏలూరు జిల్లా నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారిణి షేక్ షబ్నం బుధవారం తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఏలూరు డిపో నుంచి 20, జంగారెడ్డిగూడెం నుంచి 14, నూజివీడు నుంచి 6 బస్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈనెల 26 ఉదయం నుంచి బస్సులు ప్రారంభమై, 27న స్వామివారి కల్యాణం అనంతరం తిరిగి ప్రయాణమవుతాయని ఆమె వివరించారు.
News March 25, 2026
ఎస్సీ, ఎస్టీలకు పూర్తి స్థాయిలో లబ్ధి అందాలి: కలెక్టర్

అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం కేటాయించిన నిధులు, పథకాల లబ్ధి పూర్తి స్థాయిలో చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కేటాయించిన శాతాన్ని ఖచ్చితంగా ఖర్చు చేయాలని, హౌసింగ్, ఉపాధి, పెన్షన్లు వంటి పథకాలలో లక్ష్యాలు చేరాలని సూచించారు. గురుకులాలు, హాస్టళ్లలో జీరో వేస్ట్ మేనేజ్మెంట్ అమలు చేయాలని, PMAGY పనులు ఏప్రిల్లోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు.


