News October 6, 2025

త్వరలో సింగరేణి స్థలాల్లో పెట్రోల్ బంకులు!

image

TG: తమ సంస్థకు చెందిన ఖాళీ స్థలాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని సింగరేణి నిర్ణయించింది. ఇందుకోసం IOCL, HPCL, BPCL సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా వాటిని లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఖమ్మం(D) మణుగూరు, కొత్తగూడెంలోని ఆదివారం సంత, మంచిర్యాల(D) మందమర్రి, బెల్లంపల్లి, పెద్దపల్లి(D) రామగుండం ఏరియాల పరిధిలో మొత్తం 7 బంకులు నిర్మించేందుకు ప్రతిపాదించింది.

Similar News

News October 6, 2025

ఈ నెల 10న క్యాబినెట్ భేటీ

image

AP: వారం వ్యవధిలోనే మంత్రి వర్గం <<17905338>>మరోసారి<<>> సమావేశం కానుంది. ఈ నెల 10న సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరగనుంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముంది.

News October 6, 2025

సత్తా చాటిన శ్రియాన్షి

image

తెలుగమ్మాయి శ్రియాన్షి వలిశెట్టి Al Ain Masters వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 100 టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచి సత్తాచాటారు. ఈమె పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో మాజీ ప్రపంచ జూనియర్‌ నంబర్‌వన్‌ తస్నిమ్‌ మీర్‌పై విజయం సాధించి టైటిల్ గెలుచుకున్నారు. దీంతో శ్రియాన్షికి 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ, 5,500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

News October 6, 2025

BREAKING: రిజర్వేషన్లపై పిటిషన్ డిస్మిస్

image

TG: బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం 42శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో విచారణలో ఉండగా సుప్రీంకు ఎందుకు వచ్చారని పిటిషనర్‌ గోపాల్‌రెడ్డిని ప్రశ్నించింది. అయితే HCలో స్టే ఇవ్వకపోవడంతో ఇక్కడికి వచ్చామని పిటిషనర్ తెలిపారు. దీంతో HCలో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని SC స్పష్టం చేసింది. కాగా ఎల్లుండి హైకోర్టులో విచారణ జరగనుంది.