News October 6, 2025

వేములవాడ: నేడు క్షీర చంద్ర దర్శనం.. కోజా గరి పూర్ణిమ వ్రతం

image

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి క్షీర చంద్ర దర్శనం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. శ్రీస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఆశ్వీజ శుద్ధ చతుర్దశి ఉపరి పూర్ణిమ రోజున క్షీరచంద్ర దర్శనం సందర్భంగా నిశీపూజ ఉంటుదన్నారు. రాత్రి 10.05 నిమిషాల నుంచి కోజాగరి పూర్ణిమ వ్రతం (మహాలక్ష్మి పూజ క్షీరచంద్రపూజ) అనంతరం క్షీరచంద్ర దర్శనం జరుగుతుందన్నారు.

Similar News

News March 21, 2026

దేశాన్ని అమ్మేశారు.. కేంద్రంపై మమత ఫైర్

image

ఇంధన ధరలు పెంచాలని కేంద్రం ప్లాన్ చేస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. దేశాన్ని అమ్మేశారని మండిపడ్డారు. ‘మన్మోహన్ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండేది. ఇప్పుడు రూ.1,100 చేశారు. రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయి’ అని చెప్పారు. మరోవైపు బెంగాల్‌లో అప్రకటిత రాష్ట్రపతి పాలన నడుస్తోందని ఫైరయ్యారు. ప్రధాని మోదీ నుంచి దేశాన్ని కాపాడటమే తనకు ప్రాధాన్యమని అన్నారు.

News March 21, 2026

సంగారెడ్డి: టెన్త్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

image

జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పారదర్శకంగా జరిగేలా చూడాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎంఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్స్ అనుమతి లేదని చెప్పారు. పరీక్షా కేంద్రంలో ఏ ఘటన జరిగిన చీఫ్ సూపరింటెండ్లు, ఎంఈవో లే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. డీఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

News March 21, 2026

సంగారెడ్డి: టెన్త్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

image

జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పారదర్శకంగా జరిగేలా చూడాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎంఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్స్ అనుమతి లేదని చెప్పారు. పరీక్షా కేంద్రంలో ఏ ఘటన జరిగిన చీఫ్ సూపరింటెండ్లు, ఎంఈవో లే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. డీఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.