News October 6, 2025

నిజామాబాద్: వీడీసీల ఆగడాలపై చర్యలు తీసుకోండి

image

నిజామాబాద్ జిల్లాలో వీడీసీ ఆగడాలు పెరుగుతున్నాయి. గతంలో ఏర్గట్ల మండలం తాళ్ల రామడుగులో వీడీసీలు గౌడ కులస్థులను వెలివేసినట్లు వారు ఆరోపించారు. దీనిపై అధికారులు, పోలీసులు వారికి సర్దిచెప్పి సమస్యను పరిష్కరించారు. తాజాగా ధర్పల్లి మండలం హోన్నాజీపేటలో వీడీసీల వేధింపులకు బనావత్ బన్నాజీ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Similar News

News October 6, 2025

NZB: ZP ఛైర్మన్ దక్కించుకునేందుకు అభ్యర్థుల వేట

image

స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ విడదల కావడంతో NZB జడ్పీ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేట మొదలు పెట్టాయి. గతంలో జనరల్ స్థానం కేటగిరిలో ఉన్న జడ్పీ ఛైర్మన్ ఈసారి బీసీ మహిళకు కేటాయించారు. జిల్లాలో 31 ZPTC స్థానాలు ఉండగా అందులో 6 బీసీ మహిళలకు, 5 జనరల్ మహిళలకు, 7 స్థానాలు బీసీలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో ఆ స్థానాల నుంచి మహిళా అభ్యర్థుల కోసం పార్టీలు గాలిస్తున్నాయి.

News October 6, 2025

NZB: ప్రజలను చైతన్యం చేస్తున్న పోలీస్ కళా బృందాలు: CP

image

మాదకద్రవ్యాల వైపు యువత మొగ్గు చూపకుండా, సైబర్ నేరాలు తదితర అంశాలపై ప్రజలను పోలీసు కళా బృందాలు చైతన్య పరుస్తున్నాయని NZB పోలీస్ కమీషనర్ సాయి చైతన్య అన్నారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గ్రామాలకు కళాబృందం సభ్యులు వెళ్లి మార్చి నుంచి సెప్టెంబర్ వరకు 117 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు.

News October 5, 2025

SRSP UPDATE: 11 గేట్ల మూసివేత

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. 11 గేట్లు మూసివేసి 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఆదివారం రాత్రి ఔట్ ఫ్లోగా 1,09,790 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1,090.9 (80.053 TMC) అడుగుల నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.