News October 6, 2025
శాంతించిన వంశధార..!

ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వంశధారకు వరద పోటెత్తింది. ఒకానొక సమయంలో లక్ష క్యూసెక్యలకు పైగా నీరు నదిలో ప్రవహించింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నది శాంతించింది. సోమవారం ఉదయం 6 గంటలకు వంశధారలో 29,224 క్యూసెక్కులకు నీటి ప్రవాహం తగ్గింది. గొట్టా బ్యారేజీ 22 గేట్లను కాస్త లిఫ్ చేసి దిగువ ప్రాంతానికి నీరు విడిచి పెడుతున్నట్లు వంశధార డీఈ సరస్వతి వెల్లడించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో ప్రవాహం లేదు.
Similar News
News January 26, 2026
శ్రీకాకుళం: డీఈవో రవి బాబుకు ఉత్తమ పురస్కారం అందజేత

శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవి బాబుకు ఉత్తమ పురస్కారం దక్కింది. విద్యాశాఖలో చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తించి ఈ పురస్కారాన్ని అందించారని ఆయన తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నానని వివరించారు. జిల్లాలో విద్యాశాఖ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు.
News January 26, 2026
SKLM: కలెక్టర్కు షేక్ హ్యాండ్ ఇచ్చిన పోలీస్ జాగిలం

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయానికి చెందిన పోలీస్ జాగిలం (మున్నా డాగ్ ) కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కు సోమవారం షేక్ హ్యాండ్ ఇచ్చింది. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా కలెక్టర్కు స్వాగతం పలుకుతూ ముందుగా పుష్పగుచ్ఛం అందజేసింది. సలాం చేస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చి గ్రౌండ్లో ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
News January 26, 2026
గణతంత్ర దినోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: శ్రీకాకుళం కలెక్టర్

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ నెల 26న గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జిల్లా ప్రగతి నివేదికను ఆయన చదివి వినిపిస్తారు. వివిధ శాఖలకు చెందిన అభివృద్ధి శకటాలు ఆకర్షణగా నిలుస్తాయన్నారు.


