News October 6, 2025
తురకపాలెంలో మళ్లీ మృత్యు కలకలం!

AP: గుంటూరు రూరల్(M) తురకపాలెంలో కృష్ణవేణి అనే మహిళ హైఫీవర్తో గుంటూరు ఆసుపత్రిలో మరణించింది. గతంలో 30 వరుస మరణాలతో గ్రామం వార్తల్లోకి ఎక్కింది. పారిశుద్ధ్యం లేకపోవడం, నీటిలో యురేనియం అవశేషాల వల్లే ఇలా అవుతోందని తేలింది. ప్రభుత్వం వైద్య బృందాలను పంపి నివారణ చర్యలు చేపట్టింది. నెలరోజుల పాటు ఇవి ఆగడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా గతంలోలాగే మహిళ మరణించడంతో జనం కలవరపడుతున్నారు.
Similar News
News October 6, 2025
కెప్టెన్గా ఎదగాలన్నదే నా లక్ష్యం: జైస్వాల్

టీమ్ఇండియాకు ఏదో ఒకరోజు తాను కెప్టెన్ కావాలనుకుంటున్నట్లు యశస్వీ జైస్వాల్ వెల్లడించారు. వన్డే వరల్డ్ కప్ గెలవాలనే కసితోపాటు కెప్టెన్ కావడమూ తన దీర్ఘకాలిక లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను ఫిట్నెస్పై ఎక్కువ దృష్టి పెడుతూ నాయకుడిగా ఎదిగేందుకు రోజూ ప్రయత్నిస్తున్నా’ అని తెలిపారు. అయితే గిల్ ఫామ్లో ఉన్నంత కాలం జైస్వాల్కు కెప్టెన్ అవకాశాలు రావడం తక్కువే. దీనిపై మీ కామెంట్?
News October 6, 2025
RECORD: 10 గ్రా. బంగారం రూ.1.30 లక్షలు

దేశంలో బంగారం ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.30 లక్షలు దాటింది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.1,57,400గా ఉంది.
News October 6, 2025
మరణ భయాన్ని పోగొట్టే శివ మహా పురాణం

మానవ జీవితంలో మరణ భయాన్ని మించిన భయం మరొకటి లేదు. అటువంటి భయాన్ని సమూలంగా పోగొట్టే దివ్యౌషధం శివ మహాపురాణం. దీనిని కేవలం శ్రవణం చేస్తేనే మహా పుణ్యఫలం సిద్ధిస్తుంది. సమస్త వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాస, మంత్ర, తంత్ర, జప, తప, ధ్యాన, యోగాదుల జ్ఞానానికంతటికీ సారభూతమైంది ఈ పరమ పవిత్రమైన పురాణం. ఈ గ్రంథ పారాయణం శివ తత్వాన్ని బోధించి, మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుంది. <<-se>>#SIVOHAM<<>>