News October 6, 2025
బీసీ రిజర్వేషన్ల జీవోపై సుప్రీంలో విచారణ ప్రారంభం

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో-9ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంలో విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున లాయర్లు సింఘ్వీ, దవే వాదనలు వినిపిస్తున్నారు. విచారణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు.
Similar News
News October 6, 2025
వీరి రుణం తీర్చుకుంటేనే మానవ జన్మకు సార్థకత

మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి పితృ, దైవ, రుషి రుణాలు తీర్చుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎంతో కష్టపడి పెంచిన తండ్రికి ధర్మబద్ధంగా ఉంటూ తనయుడు తన రుణం తీర్చాలి. ఈ సృష్టిని పోషిస్తున్న భగవంతుని రుణం ధర్మాచరణతో తీర్చాలి. ఇక జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులు, రుషుల రుణాన్ని వారి జ్ఞానాన్ని ఆచరించడం ద్వారా తీర్చుకోవాలి. ఈ మూడు రుణాలను తీర్చుకున్నప్పుడే ఈ మానవ జన్మకు సార్థకత లభిస్తుంది.
News October 6, 2025
‘ECINet’లో ఎన్నికల పూర్తి సమాచారం: CEC

ఎన్నికల సమాచారం పూర్తిగా ఒకే చోట తెలుసుకునేలా ‘ECINet’ సింగిల్ విండో యాప్ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు CEC జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. దీన్ని మథర్ ఆఫ్ ఆల్ యాప్స్గా అభివర్ణించారు. బిహార్ ఎలక్షన్స్ నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. ఎలక్షన్స్కు సంబంధించిన 40కి పైగా యాప్స్ను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు. బూత్ లెవల్ ఆఫీసర్స్ నుంచి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ వరకు అందరినీ ఇది అనుసంధానం చేయనుంది.
News October 6, 2025
ఇది దేశ చరిత్రలో చీకటి రోజు: సీఎం రేవంత్

సుప్రీంకోర్టులో CJI గవాయ్పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించడాన్ని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు. ‘ఇది దేశ చరిత్రలో చీకటి రోజు. ఇలాంటి దాడులు తనను ప్రభావితం చేయలేవని CJI ధైర్యంగా ప్రకటించారు’ అని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘CJIపై దాడికి యత్నం సిగ్గుచేటు. ఇది మన న్యాయవ్యవస్థ గౌరవంపై జరిగిన దాడి. జుడీషియరీ సేఫ్టీ, సెక్యూరిటీ ఎంతో ముఖ్యం’ అని ఖర్గే అన్నారు.