News October 6, 2025
తుమ్మలలో ట్రాక్టర్ నడిపిన మంత్రి సత్యకుమార్

ధర్మవరంలోని తుమ్మలలో నిర్వహించిన వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ తగ్గింపు అవగాహన కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ నడుపుతూ రైతులతో కలసి జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అగ్ర ప్రాధాన్యతగా తీసుకుంటోందని తెలిపారు.
Similar News
News March 24, 2026
నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు పూర్తి?

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. నిన్న అసెంబ్లీ హాలులో CM రేవంత్, PCC చీఫ్ మహేశ్, కీలక మంత్రులు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. AICC ఆమోదం లభిస్తే ఈ నెలాఖరులోగా లిస్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ లెవల్లో పార్టీ కోసం శ్రమించిన ద్వితీయ శ్రేణి నాయకులకు, సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ పదవులు కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
News March 24, 2026
NLG: మొదటి విడత ‘రైతు భరోసా’ సంపూర్ణం

నల్గొండ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఎకరాకు రూ.6 వేల చొప్పున 5,22,313 మందికి రూ.268.57 కోట్లు విడుదల చేసింది. జిల్లాకు మూడు విడతల్లో మొత్తం రూ.744.64 కోట్లు మంజూరు కానున్నాయి. 20 రోజుల తర్వాత రెండో విడత, ఆ తర్వాత 25 రోజులకు మూడో విడత నిధులు అందుతాయి. ఈ నెల 25లోపు కొత్త పాస్పుస్తకాలకు దరఖాస్తు చేసిన 20,668 మందికి త్వరలోనే ఈ సాయం అందనుంది.
News March 24, 2026
కరెంట్ అఫైర్స్

* ప్రపంచ వారసత్వ జాబితాలో సారనాథ్, మేఘాలయలోని లివింగ్ రూట్ బ్రిడ్జెస్ను చేర్చాలని UNESCOకు ప్రతిపాదన.
* భారత్-సీషెల్స్ మధ్య ‘ఎక్సర్సైజ్ లామిటియే’ 11వ ఎడిషన్ పూర్తి. లామిటియే అంటే స్నేహం.
* వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్-సింగపూర్ ఛాంగి ఎయిర్పోర్ట్. ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్టుకు 28వ స్థానం.
* జలంధర్లోని ఆదంపుర్ విమానాశ్రయానికి ‘శ్రీగురు రవిదాస్ మహారాజ్ ఎయిర్పోర్టు’గా పేరు మార్పు. SHARE IT


