News October 6, 2025

సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్

image

PGRSకు వచ్చే అర్జీదారుల సమస్యలను సరైన ఎండార్స్‌మెంట్‌తో ముగించాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి సుమారు 150 వినతిపత్రాలను స్వీకరించారు. కొన్ని అర్జీలు పునరావృతమవుతున్నాయని, ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.

Similar News

News October 6, 2025

జగిత్యాల: నిబద్ధతతో ఎన్నికలు నిర్వహించాలి: కలెక్టర్

image

స్థానిక ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా నిబద్ధతతో, క్రమశిక్షణతో ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాలలో నామినేషన్‌కు సంబంధించి ఆర్ఓ, ఏఆర్ఓలకు సోమవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల పకడ్బందీ నిర్వాహణను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

News October 6, 2025

దౌల్తాబాద్: సీపీ అనురాధ పెద్ద మనసు

image

దౌల్తాబాద్ మండలం ముత్యంపేటకు చెందిన జోడు రాకేశ్‌కు కుడిచేయి లేని విషయం తెలుసుకున్న సీపీ డాక్టర్ బి. అనురాధ పెద్ద మనసు చాటుకున్నారు. సంబంధిత వైద్యులతో మాట్లాడి రాకేశ్‌కు కృత్రిమ చేయి(ఆర్టిఫీషియల్‌ హ్యాండ్‌) అమర్చేందుకు అయ్యే ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న సీపీని రాకేశ్ కలిసి పుష్పగుచ్ఛం అందించగా, రాకేశ్ తండ్రి మనోహార్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

News October 6, 2025

మనోహరాబాద్: కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట శివారులోని నోబుల్ ఫార్మసీ కళాశాలలో తూప్రాన్ డివిజన్ పరిధి ఆరు మండలాలకు ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. నోబుల్ కళాశాలలో సౌకర్యాలు, భద్రత, ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తూప్రాన్ తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఐ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.