News October 6, 2025
కురుపాం గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి

కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెంనాయుడు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసర ప్రాంతాలు, డైనింగ్ హాలు, కిచెన్ షెడ్, మరుగుదొడ్లను క్షుణంగా పరిశీలించారు. అనంతరం ఇద్దరు విద్యార్థులు మృతికి మిగతా విద్యార్థులు అనారోగ్యం బారిన పడడానికి గల కారణాలను పాఠశాల సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు.
Similar News
News October 6, 2025
జగిత్యాల: నిబద్ధతతో ఎన్నికలు నిర్వహించాలి: కలెక్టర్

స్థానిక ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా నిబద్ధతతో, క్రమశిక్షణతో ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాలలో నామినేషన్కు సంబంధించి ఆర్ఓ, ఏఆర్ఓలకు సోమవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల పకడ్బందీ నిర్వాహణను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
News October 6, 2025
దౌల్తాబాద్: సీపీ అనురాధ పెద్ద మనసు

దౌల్తాబాద్ మండలం ముత్యంపేటకు చెందిన జోడు రాకేశ్కు కుడిచేయి లేని విషయం తెలుసుకున్న సీపీ డాక్టర్ బి. అనురాధ పెద్ద మనసు చాటుకున్నారు. సంబంధిత వైద్యులతో మాట్లాడి రాకేశ్కు కృత్రిమ చేయి(ఆర్టిఫీషియల్ హ్యాండ్) అమర్చేందుకు అయ్యే ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న సీపీని రాకేశ్ కలిసి పుష్పగుచ్ఛం అందించగా, రాకేశ్ తండ్రి మనోహార్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
News October 6, 2025
మనోహరాబాద్: కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట శివారులోని నోబుల్ ఫార్మసీ కళాశాలలో తూప్రాన్ డివిజన్ పరిధి ఆరు మండలాలకు ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. నోబుల్ కళాశాలలో సౌకర్యాలు, భద్రత, ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తూప్రాన్ తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ఐ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.