News October 6, 2025
దీపావళి కానుక.. అకౌంట్లలోకి రూ.2వేలు?

21వ విడత PM కిసాన్ నిధుల విడుదలకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా మరో వారంలో అన్నదాతల అకౌంట్లలో ₹2K చొప్పున జమ చేయనుందని నేషనల్ మీడియా పేర్కొంది. EKYC, ఆధార్-బ్యాంక్ లింకు కాలేదంటే వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
* ప్రతిరోజూ పంటల్లో చీడపీడల నివారణ, కొత్త విధానాలు, పాడి, జీవాలకు సంబంధించిన కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> కేటగిరీకి వెళ్లండి.
Similar News
News October 6, 2025
ఎన్నికల కమిషన్పై KTR వ్యంగ్యాస్త్రాలు

TG: బిహార్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించడంపై BRS నేత KTR వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘వెల్ డన్ ECI. ముందు SIRతో భారీ స్థాయిలో ఓట్లను తొలగించింది. ఆ తర్వాత ఎన్నికల ముందు 1.21 కోట్ల మంది మహిళా ఓటర్లకు <<17929774>>లంచం<<>> ఇచ్చేందుకు NDA ప్రభుత్వానికి అనుమతిచ్చింది. ఇప్పుడు ఫ్రీ & ఫెయిర్ ఎలక్షన్స్ అని చెబుతోంది. వెరీ వెల్ డన్’ అంటూ సెటైర్ వేశారు.
News October 6, 2025
చైనా వెపన్స్ అద్భుతంగా పనిచేశాయి: పాక్ LG

ఆపరేషన్ సిందూర్లో చైనా మేడ్ వెపన్స్ అద్భుతంగా పనిచేశాయని పాక్ లెఫ్టినెంట్ జనరల్(LG) అహ్మద్ షరీఫ్ చౌదరీ అన్నారు. ‘మేం అన్ని రకాల సాంకేతికతను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇటీవల చైనీస్ ప్లాట్ఫామ్స్ అద్భుత సామర్థ్యాన్ని ప్రదర్శించాయి’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కాగా చైనాకు చెందిన PL-15, HQ-9P సహా అన్ని రకాల మిస్సైళ్లను భారత డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా కూల్చేసిన విషయం తెలిసిందే.
News October 6, 2025
విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి: లోకేశ్

ముంబై పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేశ్ వరుసగా పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు. విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయాలని రహేజా గ్రూప్ను కోరారు. అమరావతిలో ప్రీమియం అపార్ట్మెంట్ ప్రాజెక్టులను ప్రారంభించాలని కోరారు. అంతకుముందు టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్తో భేటీ అయిన లోకేశ్.. సెల్, మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ స్థాపనకు గల అవకాశాలను పరిశీలించాలని కోరారు.