News April 7, 2024

ANU: పీజీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈనెల 10వ తేదీ నుంచి జరగాల్సిన పీజీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేశామని సీఈ ఆర్‌ ప్రకాశరావు తెలిపారు. ఈనెల 22వ తేదీ నుంచి నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. కళాశాలల ప్రిన్సిపల్స్‌, యాజమాన్యాలు, విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.

Similar News

News January 25, 2026

గుంటూరులో రిపబ్లిక్ డే వేడుకలు రేపు 11:30కి ప్రారంభం: కలెక్టర్

image

పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం జరగనున్న జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం పరిశీలించారు. రేపు 11:30కి రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్రస్థాయి వేడుకలకు హాజరు కావాల్సి ఉన్నందున జాతీయ పతాక ఆవిష్కరణ సమయంలో మార్పులు చేయడం జరిగిందని తెలిపారు. అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News January 25, 2026

గుంటూరు జిల్లా ప్రజలకి గమనిక

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ నిర్వహణను సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రద్దు చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిమగ్నమై ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే PGRS, రెవెన్యూ క్లీనిక్‌ని రద్దు చేశామని అన్నారు. జిల్లా ప్రజలు విషయాన్ని గమనించి కలెక్టరేట్‌కి వచ్చే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు.

News January 25, 2026

PGRSరద్దు.. కానీ ఫోన్ చెయ్యొచ్చు: GNT కమిషనర్

image

గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నగర ప్రజలు విషయాన్ని గమనించి ఏదైనా సమస్యలు ఉంటే 0863 2345103కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.