News October 6, 2025

₹9వేల కోట్లతో HYDలో ఫార్మా కంపెనీ: US సంస్థతో చర్చ

image

TG: Eli Lilly(US) సంస్థ ప్రతినిధులు CM రేవంత్‌తో భేటీ అయ్యారు. HYDలో ₹9వేల కోట్లతో ఫార్మా పరిశ్రమ ఏర్పాటుపై సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్
జాన్సన్ చర్చించారు. మాన్యుఫ్యాక్చర్ ప్లాంట్, క్వాలిటీ సెంటర్ నెలకొల్పుతామన్నారు. కాగా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని సీఎం వారికి హామీ ఇచ్చారు. HYDలో అనేక దిగ్గజ కంపెనీలు ఉన్నాయని, దేశంలో 40 శాతం బల్క్ డ్రగ్స్ ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు.

Similar News

News October 6, 2025

ఎన్నికల కమిషన్‌పై KTR వ్యంగ్యాస్త్రాలు

image

TG: బిహార్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించడంపై BRS నేత KTR వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘వెల్ డన్ ECI. ముందు SIRతో భారీ స్థాయిలో ఓట్లను తొలగించింది. ఆ తర్వాత ఎన్నికల ముందు 1.21 కోట్ల మంది మహిళా ఓటర్లకు <<17929774>>లంచం<<>> ఇచ్చేందుకు NDA ప్రభుత్వానికి అనుమతిచ్చింది. ఇప్పుడు ఫ్రీ & ఫెయిర్ ఎలక్షన్స్ అని చెబుతోంది. వెరీ వెల్ డన్’ అంటూ సెటైర్ వేశారు.

News October 6, 2025

చైనా వెపన్స్ అద్భుతంగా పనిచేశాయి: పాక్ LG

image

ఆపరేషన్ సిందూర్‌లో చైనా మేడ్ వెపన్స్ అద్భుతంగా పనిచేశాయని పాక్ లెఫ్టినెంట్ జనరల్(LG) అహ్మద్ షరీఫ్ చౌదరీ అన్నారు. ‘మేం అన్ని రకాల సాంకేతికతను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇటీవల చైనీస్ ప్లాట్‌ఫామ్స్ అద్భుత సామర్థ్యాన్ని ప్రదర్శించాయి’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కాగా చైనాకు చెందిన PL-15, HQ-9P సహా అన్ని రకాల మిస్సైళ్లను భారత డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా కూల్చేసిన విషయం తెలిసిందే.

News October 6, 2025

విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి: లోకేశ్

image

ముంబై పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేశ్ వరుసగా పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు. విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయాలని రహేజా గ్రూప్‌ను కోరారు. అమరావతిలో ప్రీమియం అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులను ప్రారంభించాలని కోరారు. అంతకుముందు టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో భేటీ అయిన లోకేశ్.. సెల్, మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ స్థాపనకు గల అవకాశాలను పరిశీలించాలని కోరారు.