News October 6, 2025

రొమ్ము క్యాన్సర్ కచ్చితంగా తగ్గుతుంది: డా.విశాల్

image

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది అపోహ మాత్రమేనని హేమాటో ఆంకాలజిస్ట్ డా.విశాల్ టోకా స్పష్టం చేశారు. ‘తొలి దశలో ఆంకో ప్లాస్టీ అనే శస్త్రచికిత్సతో రొమ్మును రక్షిస్తూ క్యాన్సర్‌ను ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. రెండో దశలోనూ పూర్తిగా తగ్గించవచ్చు. 3, 4 దశల్లో ఆపరేషన్, రేడియేషన్, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సల అవసరం పడవచ్చు. కచ్చితంగా క్యాన్సర్ తగ్గుతుంది’ అని పేర్కొన్నారు.

Similar News

News October 6, 2025

ఎన్నికల కమిషన్‌పై KTR వ్యంగ్యాస్త్రాలు

image

TG: బిహార్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించడంపై BRS నేత KTR వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘వెల్ డన్ ECI. ముందు SIRతో భారీ స్థాయిలో ఓట్లను తొలగించింది. ఆ తర్వాత ఎన్నికల ముందు 1.21 కోట్ల మంది మహిళా ఓటర్లకు <<17929774>>లంచం<<>> ఇచ్చేందుకు NDA ప్రభుత్వానికి అనుమతిచ్చింది. ఇప్పుడు ఫ్రీ & ఫెయిర్ ఎలక్షన్స్ అని చెబుతోంది. వెరీ వెల్ డన్’ అంటూ సెటైర్ వేశారు.

News October 6, 2025

చైనా వెపన్స్ అద్భుతంగా పనిచేశాయి: పాక్ LG

image

ఆపరేషన్ సిందూర్‌లో చైనా మేడ్ వెపన్స్ అద్భుతంగా పనిచేశాయని పాక్ లెఫ్టినెంట్ జనరల్(LG) అహ్మద్ షరీఫ్ చౌదరీ అన్నారు. ‘మేం అన్ని రకాల సాంకేతికతను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇటీవల చైనీస్ ప్లాట్‌ఫామ్స్ అద్భుత సామర్థ్యాన్ని ప్రదర్శించాయి’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కాగా చైనాకు చెందిన PL-15, HQ-9P సహా అన్ని రకాల మిస్సైళ్లను భారత డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా కూల్చేసిన విషయం తెలిసిందే.

News October 6, 2025

విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి: లోకేశ్

image

ముంబై పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేశ్ వరుసగా పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు. విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయాలని రహేజా గ్రూప్‌ను కోరారు. అమరావతిలో ప్రీమియం అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులను ప్రారంభించాలని కోరారు. అంతకుముందు టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో భేటీ అయిన లోకేశ్.. సెల్, మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ స్థాపనకు గల అవకాశాలను పరిశీలించాలని కోరారు.