News October 6, 2025
సోంపేటలో ఏపీ పుడ్ కమిషన్ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీ

సోంపేట మండలం బారువ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఏపీ పుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. భోజనాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చెశారు. అనంతరం వార్డెన్ రవికుమార్ను అభినందిస్తూ సన్మానం చేశారు. ఈ తనిఖీలో జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి డీడీ మధుసూదనరావు, జిల్లా సివిల్ సప్లై అధికారి పాల్గొన్నారు.
Similar News
News October 6, 2025
మెళియాపుట్టి: కరెంట్ షాక్తో 30 ఏళ్ల యువకుడి మృతి

ఇంటిపై చెట్టు కొమ్మలను తొలగిస్తుండగా కరెంటు షాక్తో ఓ యువకుడు సోమవారం మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళియాపుట్టి(M) గంగరాజపురం గ్రామానికి చెందిన చంటి(30) ఇంటిపై చెట్టు కొమ్మలను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తూపై కప్పునకు ఉన్న కరెంట్ వైర్ తగిలి మరణించాడు. అక్క దమయంతి ఫిర్యాదుతో ఎస్ఐ రమేష్ బాబు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పాతపట్నం ఆసుపత్రికి తరలించారు.
News October 6, 2025
SKLM: ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణాన్ని ఉపసంహరించుకోవాలి’

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దళిత-ఆదివాసీ-బహుజన-మైనార్టీ సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను సంఘ నేతలు కలుసుకుని వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలని అంతా కోరుకుంటున్నారని తెలియజేసారు.
News October 6, 2025
శాంతించిన వంశధార..!

ఇటీవల భారీ వర్షాలు కురవడంతో వంశధారకు వరద పోటెత్తింది. ఒకానొక సమయంలో లక్ష క్యూసెక్యలకు పైగా నీరు నదిలో ప్రవహించింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నది శాంతించింది. సోమవారం ఉదయం 6 గంటలకు వంశధారలో 29,224 క్యూసెక్కులకు నీటి ప్రవాహం తగ్గింది. గొట్టా బ్యారేజీ 22 గేట్లను కాస్త లిఫ్ చేసి దిగువ ప్రాంతానికి నీరు విడిచి పెడుతున్నట్లు వంశధార డీఈ సరస్వతి వెల్లడించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో ప్రవాహం లేదు.