News October 6, 2025
అధికారులు ప్రజా సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల వినతి పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంలో నాణ్యత చూపని అధికారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Similar News
News October 6, 2025
GWL: బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి: SP

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు చూడాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 12 అర్జీలు వచ్చాయన్నారు. భూ వివాదాలకు సంబంధించి 6, గొడవకు సంబంధించి 1, కొడుకులు పట్టించుకోవడంలేదని 1, ప్లాట్ భూకబ్జాకు సంబంధించి 2, అప్పు తీసుకొని ఇవ్వడం లేదని 1, ఇతర అంశాలకు సంబంధించి 1, మొత్తం 12 ఫిర్యాదులు వచ్చాయన్నారు.
News October 6, 2025
ఆ సిరప్పై ఆందోళన వద్దు: మంత్రి సత్యకుమార్

AP: కేంద్ర ఆరోగ్యశాఖలోని DGHS సూచన ప్రకారం 2ఏళ్లలోపు పిల్లలకు దగ్గు, జలుబుకు ద్రవరూప మందులను డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయకుండా ఉత్తర్వులివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. MP, రాజస్థాన్లో పిల్లల మరణానికి దారితీసిన కల్తీ దగ్గు మందు రాష్ట్రానికి సరఫరా కాలేదన్నారు. మెడికల్ షాపులు, ప్రభుత్వాసుపత్రులకు ఆ మందు రానందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
News October 6, 2025
HYD: జూబ్లీహిల్స్లో పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తాం: కర్ణన్

నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా వెంటనే పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తామని, నవంబర్ 14వ తేదీన నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి మైదానంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఈసీ నిబంధనలను అందరూ పాటించాలని సూచించారు.