News October 6, 2025

HYDలో 95% పెరిగిన బిల్టప్ ఏరియా

image

గత 30 ఏళ్లలో దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్మాణాల విస్తీర్ణం రెట్టింపైందని ‘సిటీస్ ఇన్ మోషన్’‌లో స్వైర్ యార్డ్ సంస్థ వెల్లడించింది. 8 ప్రధాన నగరాల్లో బిల్టప్ ఏరియా మొత్తం 4,308 చదరపు కిలోమీటర్లకు చేరింది. ఇది 98% పెరుగుదలగా పేర్కొంది. HYDలో ప్రస్తుతం బిల్టప్ ఏరియా 519 చ.కి.మీ.గా ఉండగా, 1995లో 267 చ.కి.మీ. మాత్రమే ఉండేది. ఈ మధ్యకాలంలో 252 చ.కి.మీ. పెరిగి, 95% వృద్ధి నమోదైంది.

Similar News

News October 6, 2025

HYD: విద్యారంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది: కోమటిరెడ్డి

image

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గం ఎర్రమంజిల్‌లో ప్రభుత్వ నూతన పాఠశాల భవనాన్ని స్థానిక MLA దానం నాగేందర్, MLC రియాజుల్ హాసన్, జిల్లా కలెక్టర్ హరిచందనతో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

News October 6, 2025

HYD: జూబ్లీహిల్స్‌లో పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తాం: కర్ణన్

image

నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా వెంటనే పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తామని, నవంబర్ 14వ తేదీన నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి మైదానంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఈసీ నిబంధనలను అందరూ పాటించాలని సూచించారు.

News October 6, 2025

HYD: కాసేపట్లో ఇంటికి.. ఇంతలోనే యాక్సిడెంట్

image

ఫోన్ పోయిందని మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా దంపతులను వెనుక నుంచి కంటైనర్ లారీ వేగంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మేడ్చల్ ITI కళాశాల ముందు జాతీయ రహదారి-44పై జరిగిన ఈ ఘటనలో కళావతి(35) తలపై నుంచి లారీ దూసుకెళ్లిందన్నారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందిందని, ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.