News October 6, 2025
అన్ని గ్రామాలకు నీరందించాలి: కలెక్టర్

జల సంరక్షణ ప్రణాళికపై RWS ఇంజినీర్లకు బాపట్ల విస్తరణ శిక్షణా కేంద్రంలో 3 రోజుల శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జల జీవన్ మెషిన్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
Similar News
News March 18, 2026
సిద్దిపేట: ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని షెడ్యూల్ కులాల అభ్యర్థులు స్వయం ఉపాధి పొందేందుకు ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక 2025-26 కింద రాయితీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయ భార్గవ కోరారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతానికి చెందిన వారైతే రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండి, 21 నుంచి 50 సంవత్సరాలు కలిగి ఉన్నవారు అర్హులన్నారు. ఈనెల 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News March 18, 2026
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. పాస్లు ఇలా తీసుకోండి!

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ‘దివ్యాంగ శక్తి’ పథకానికి అమరావతిలో CM CBN శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గాల్లో MLAలు ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని బస్పాస్ కౌంటర్లలో సర్టిఫికెట్లు చూపించి పాస్లు తీసుకోవచ్చు. APSRTC యాప్, మనమిత్ర యాప్ ద్వారా కూడా డిజిటల్ పాస్ పొందొచ్చు. ఈ స్కీమ్తో రాష్ట్రంలో 11.16 లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి కలగనుంది.
News March 18, 2026
జూన్లో గ్రూప్స్ నోటిఫికేషన్?

AP: గ్రూప్-1,2 పోస్టుల భర్తీకి APPSC సిద్ధమవుతోంది. జూన్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన డేటా ప్రకారం గ్రూప్-1లో 101 పోస్టులు, గ్రూప్-2లో 470 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఆగస్టులో, గ్రూప్-2కు సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.


