News October 6, 2025

జగిత్యాల: నిబద్ధతతో ఎన్నికలు నిర్వహించాలి: కలెక్టర్

image

స్థానిక ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా నిబద్ధతతో, క్రమశిక్షణతో ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాలలో నామినేషన్‌కు సంబంధించి ఆర్ఓ, ఏఆర్ఓలకు సోమవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల పకడ్బందీ నిర్వాహణను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 6, 2025

ఎడపల్లి: బంగారం కోసం మహిళ హత్య.. ఇద్దరి అరెస్టు

image

దూరపు బంధువైన మహిళను దారుణంగా హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్న కేసులో ఎడపల్లి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. హత్య జరిగిన మరుసటి రోజు నుంచే రంగంలోకి దిగిన పోలీసులు.. క్లూస్‌ను ఛేదించి నిందితుడైన జైతాపూర్ గ్రామానికి చెందిన పురిమేటి బాలకృష్ణ (36)ను, కొండపాక లక్ష్మయ్య (55)లను అదుపులోకి తీసుకొని వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ముత్యాల రమ తెలిపారు.

News October 6, 2025

సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలి: మేయర్

image

నగరంలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ (సీబీజీ)ఏర్పాటుకు గల అవకాశాలు పరిశీలించాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం క్లైమేట్ ప్రాజెక్ట్స్ ప్రిపరేషన్ ఫెసిలిటీ(సీపీపీఎఫ్)లో భాగంగా శక్తి, పీడబ్ల్యుసీ ఏజెన్సీలు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి మేయర్ పాల్గొన్నారు.

News October 6, 2025

బ్యాలెట్ పేపర్ల ముద్రణకు 8లోపు టెండర్లు దాఖలు చేయాలి: కలెక్టర్

image

స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల బ్యాలెట్ పేపర్ల ముద్రణకు సంబంధించి అక్టోబర్ 8లోపు టెండర్లు దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం తెలిపారు. ఆర్డర్ ఇచ్చిన నాలుగు రోజుల్లోపు బ్యాలెట్ పేపర్లను ముద్రణ చేయాలని ఆదేశించారు. ముద్రణకు అవసరమైన సింబల్ బ్లాక్స్, పింక్, వైట్ పేపర్ వంటి సామాగ్రిని సరఫరా చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.