News October 6, 2025
రంగారెడ్డి: బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కార్యకర్తల అభిప్రాయాలను బీజేపీ పరిగణలోకి తీసుకుంటోంది. బూత్ స్థాయి నుంచి కార్యకర్తల వరకు అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే అభ్యర్థికి పార్టీ తరఫున బీఫామ్ అందజేయనుంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని గ్రామ, మండల స్థాయిలో బరిలో నిలవాలని భావించే ఆశావాహుల పేర్లను నమోదు చేసుకుంటోంది.
Similar News
News October 6, 2025
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి: రంగారెడ్డి కలెక్టర్

రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల్లో నోడల్, పోలింగ్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు, పోలీసులతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, విధులు కేటాయించిన అధికారులు పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలన్నారు.
News October 6, 2025
RR: గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాజకీయ పార్టీలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో ఖరారైన రిజర్వేషన్లపై ఆయా పార్టీలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాయి. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆశావాహులు ఉత్సాహం చూపుతుండగా.. MPTC, ZPTC స్థానాల నుంచి పోటీ చేసే వారి పేర్లను సేకరించి పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. కాగా, కోర్టు తీర్పు తర్వాత ముందుకెళ్లాలని పార్టీలు యోచిస్తున్నాయి.
News October 5, 2025
RR: రేపటి నుంచి ప్రజావాణికి బ్రేక్

రంగారెడ్డి జిల్లాలో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.