News October 6, 2025

రీ-ఓపెన్ అయిన ఫిర్యాదులపై ఫోకస్ పెట్టాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం 182 అర్జీలు అందాయని, వాటిని నాణ్యతతో, గడువులోగా పరిష్కరించాలన్నారు. రీ-ఓపెన్ అయిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రెవెన్యూ అంశాలలో సంతృప్తి స్థాయి పెంచాలని సూచించారు.

Similar News

News March 4, 2026

సంగారెడ్డి జైలు సూపరిండెంట్‌గా సంతోష్ కుమార్ బాధ్యతలు

image

సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగార సూపరిండెంట్‌గా సంతోష్ కుమార్ రాయ్ బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది ఇదే జైలులో పనిచేసిన ఆయన జూన్‌లో హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ అయ్యారు. తాజాగా ప్రభుత్వం తిరిగి ఆయన్ని సంగారెడ్డికే నియమించడంతో బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జైలు అధికారులు, సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

News March 4, 2026

HNK: ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్‌కు 98% హాజరు

image

నేడు జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్‌కు 98% విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. జనరల్ విద్యార్థులు 17879, ఒకేషనల్ 1017కి 18475 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. జనరల్ విద్యార్థులు 401, ఒకేషనల్ విద్యార్థులు 20 మంది ఆబ్సెంట్ అయ్యారు. విద్యార్థుల హాజరు శాతం 98గా నమోదు అయిందని, ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.

News March 4, 2026

బిహార్ సీఎంగా బీజేపీ నేత?

image

బిహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. CM నితీశ్‌ను రాజ్యసభకు పంపే యోచనలో JDU ఉన్నట్లు సమాచారం. ఆయనకు BJP కేంద్ర క్యాబినెట్‌లో చోటు కల్పించనుందని తెలుస్తోంది. బిహార్ CMగా బీజేపీ నేతకు పగ్గాలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 89, జేడీయూ 85 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే.