News October 6, 2025
2019 తర్వాతా CBN సీఎంగా ఉంటే పోలవరం పూర్తయ్యేది: నిమ్మల

2027 చివరి నాటికి PM చేతుల మీదుగా పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. 2019 తర్వాత సీఎంగా CBN కొనసాగుంటే ఇప్పటికే అది పూర్తయ్యేదన్నారు. YCP హయాంలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, రివర్స్ టెండర్లంటూ పనులు జాప్యం చేశారని విమర్శించారు. తాము పనులు వేగవంతం చేశామన్నారు. బిహార్ ఎన్నికలయ్యాక కేంద్ర మంత్రి CRపాటిల్ ప్రాజెక్టును సందర్శిస్తారని ఆయనతో భేటీ అనంతరం చెప్పారు.
Similar News
News October 7, 2025
30 ఏళ్ల క్రితం రూ.1000 పెట్టుబడి.. ఇవాళ రూ.1.83 కోట్లు!

షేర్ మార్కెట్లో సరైన పెట్టుబడులు భారీగా రిటర్న్స్ ఇస్తాయని మరోసారి రుజువైంది. 30ఏళ్ల క్రితం రూ.వెయ్యితో కొన్న షేర్ల విలువ ఇప్పుడెంత ఉంటుందని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఓ వ్యక్తి 1995లో JVSLలో రూ.10 చొప్పున 100 షేర్లు కొన్నాడు. JSWలో JVSL విలీనం కాగా ఆ షేర్లు 1600గా, 1:10గా స్ప్లిట్ అయ్యాక 16,000 షేర్లుగా మారాయి. ప్రస్తుతం ఈ షేర్ల విలువ ₹1.83 కోట్లుగా ఉంటుందని పలువురు చెబుతున్నారు.
News October 7, 2025
తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పాలి: కమల్

కరూర్ తొక్కిసలాటలో 41 మంది మరణించిన ప్రాంతాన్ని MP కమల్ హాసన్ సందర్శించారు. తప్పును అంగీకరించాలని, క్షమాపణ చెప్పాల్సిన సమయమిదని వ్యాఖ్యానించారు. CM స్టాలిన్ తీసుకున్న చర్యలకు కృతజ్ఞత తెలిపారు. అయితే ఏ ప్రభుత్వానికైనా ఇలాంటి సమయాల్లో బాధ్యత ఉంటుందని చెప్పారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున తప్పొప్పులపై మాట్లాడలేనన్నారు. కాగా తన సభలో ఈ ఘటన జరిగినా TVK చీఫ్ విజయ్ ఇప్పటివరకు బాధితుల్ని పరామర్శించలేదు.
News October 7, 2025
పిల్లలకు దగ్గు మందు (కాఫ్ సిరప్).. జాగ్రత్తలు

*వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు దగ్గు మందు ఇవ్వకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
*డాక్టర్ సూచన లేకుండా మందులు ఇవ్వొద్దు. ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండాల్సిందే.
*పెద్దలకు ఇచ్చే మందులను పిల్లలకు ఇవ్వకూడదు. తక్కువ మోతాదులో ఇచ్చినా ప్రమాదమే.
*తయారీ, ఎక్స్పైరీ తేదీని చూడాలి.
*రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు చాలా సార్లు దానంతట అదే తగ్గుతుంది. వారికి సిరప్ వాడకూడదు.