News October 6, 2025

స.హ చట్టంపై విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

సమాచార హక్కు చట్టం వారోత్సవాలను జిల్లా, డివిజన్, మండల కేంద్రాలలో నిర్వహించారని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 5వ తేదీ నుంచి మొదలైన సమాచార హక్కు చట్టం వారోత్సవాలు ఈ నెల 12వ తేదీ వరకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 13, 2026

NZB: ‘జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి’

image

రాజీ మార్గమే రాజ మార్గమని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీపీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో చిన్న చిన్న కేసులు, మైనర్ క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ చలాన్, సివిల్ వివాదాలు సులభంగా పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News March 13, 2026

మాజీ DGP HJ దొర కన్నుమూత

image

ఉమ్మడి ఏపీ డీజీపీ HJ దొర కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. 1943లో శ్రీకాకుళంలో జన్మించిన దొర.. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేశారు. 1965 బ్యాచ్‌కు చెందిన IPS అధికారి. కేంద్రంలో విజిలెన్స్‌ అధికారిగా, CISFకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌‌గా పనిచేశారు. పదవిలో ఉండగా.. ఆయన్ని చంపేస్తామని మావోయిస్టులు అప్పట్లో బెదిరించారు.

News March 13, 2026

UPDATE: ప్రమాద బస్సులో రామ చిలుకలు.. కొన్ని మృతి..!

image

ఇందల్వాయి మండలం గన్నారం గ్రామ శివారులో బస్సు బోల్తా పడి నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బస్సులో అధికారులు రామచిలుకల పెట్టెను గమనించి బయటకు తీశారు. పెట్టెలో సుమారు 60 రామచిలుకలను కుక్కి ఉంచడంతో ఊపిరాడక 8 మృతి చెందాయి. దీంతో మిగిలిన చిలుకలను బయటకు తీసి వాటిని నీళ్లు తాగించి అనంతరం సమీప అటవీప్రాంతంలో వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ కొన్ని చిలుకలను పశువైద్యశాలకు తరలించారు.