News April 7, 2024
రాజాంలో క్రికెట్ బెట్టింగ్.. ఇద్దరు అరెస్టు

రాజాంలోని క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న తెలగవీధి, పుచ్చలవీధికి చెందిన ఇద్దరు వ్యక్తుపై కేసు నమోదు చేసి రూ.18,500 నగదు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు రాజాం టౌన్ సీఐ మోహనరావు శనివారం రాత్రి తెలిపారు. బెట్టింగ్ నిర్వహణకు సంబంధించిన పుస్తకాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. బెట్టింగ్కు పాల్పడిన, అసాంఘిక చర్యలు జరిగినా వెంటనే డయల్ 100 సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News October 26, 2025
SKLM: నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు

నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉరిటి సాయికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల31న జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంవద్ద ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలియజేశారు. ITI అర్హత కలిగి ఎలక్ట్రిషన్లో అనుభవం ఉండాలన్నారు. 30 ఏళ్లు కలిగి https://apssdc.inloలో నమోదు చేసుకోవాలన్నారు.
News October 26, 2025
పాతపట్నం: కూతురిపై తండ్రి అఘాయిత్యం.. అబార్షన్ చేయడంతో మృతి

పాతపట్నం మండలం సరాళి గ్రామానికి చెందిన పోలాకి అప్పారావు హైదరాబాదులో ఒక అపార్ట్మెంట్ వద్ద వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. 11 ఏళ్ళ కూతురిపై అఘాయిత్యం చేయడంతో గర్భవతి అయింది. అక్కడ ఉన్నవారికి తెలియకుండా శ్రీకాకుళం తీసుకొచ్చి అబార్షన్ చేయించగా ఆరోగ్యం వికటించడంతో విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ ఆమె మృతి చెందింది. అక్కడి వైద్యుల సమాచారం మేరకు పాతపట్నం ఎస్సై మధుసూదన రావు శనివారం కేసు నమోదు చేశారు.
News October 26, 2025
RAINS: శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక అధికారిగా చక్రదర్ బాబు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను తీవ్ర వాయుగుండం రూపంలో దూసుకొస్తుంది. ఈ తుఫాను నుంచి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక అధికారిగా IAS చక్రదర్ బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో జిల్లా JC గా పనిచేసిన అనుభవం ఇతనికుంది.


