News October 6, 2025

పోలీస్ ప్రధాన కార్యాలయానికి 64 అర్జీలు

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 64 అర్జీలు వచ్చినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఆయన నేరుగా వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి చట్టపరిధిలో విచారించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

Similar News

News March 11, 2026

NZB: పదో తరగతి పరీక్షలకు ఎన్ని సెంటర్లంటే..

image

NZB జిల్లాలో ఈనెల 14 నుంచి SSC పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాటును చేసింది. జిల్లాలో మొత్తం విద్యార్థుల సంఖ్య:24,399
అబ్బాయిలు:12,244,
అమ్మాయిలు:12,155,
పరీక్షా కేంద్రాల సంఖ్య:144
చీఫ్ సూపరింటెండెంట్ల:144
డిపార్ట్‌మెంటల్ అధికారుల:144
ఇన్విజిలేటర్లు: 1,214 ఉన్నారు. అలాగే విద్యార్థుల సౌకర్యార్థం
జిల్లా హెల్ప్ లైన్ నంబర్: 9030282993ను ఏర్పాటు చేశారు.

News March 11, 2026

విశాఖ: 969 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన!

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 969 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. విశాఖలోని భీమిలి, పెందుర్తి మండలాల్లో 79 పంచాయతీలు ఉండగా.. అనకాపల్లి జిల్లాలోని 24 మండలాల్లో 646 పంచాయతీలు కలవు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 మండలాల్లో 244 పంచాయతీలు ఉన్నాయి. ముందుగా పరిషత్ ఎన్నికలు నిర్వహించి, తర్వాత పంచాయతీ ఎన్నికలు చేపట్టే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో అప్పటివరకు ప్రత్యేక పాలన కొనసాగనుంది.

News March 11, 2026

ఉక్రెయిన్ ఆఫర్‌కు నో.. US చేసిన బిగ్ మిస్టేక్!

image

ఇరాన్ డ్రోన్లను ఎదుర్కోవడంలో US భారీ పొరపాటు చేసినట్లు సమాచారం. యుద్ధానికి 7 నెలల ముందే ఇరాన్ షాహెద్ డ్రోన్లను కూల్చే టెక్నాలజీని ఇస్తామని ఉక్రెయిన్ ఆఫర్ చేసిందని తెలుస్తోంది. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చేసిన ఈ ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం అప్పట్లో తిరస్కరించిందట. తీరా ఇప్పుడు ఇరాన్ డ్రోన్లు అమెరికా రక్షణ వ్యవస్థలను దెబ్బ తీస్తుండటంతో వాషింగ్టన్ ఇప్పుడు తిరిగి అదే ఉక్రెయిన్‌ను ఆశ్రయిస్తోంది.