News October 6, 2025

GWL: బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి: SP

image

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు చూడాలని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 12 అర్జీలు వచ్చాయన్నారు. భూ వివాదాలకు సంబంధించి 6, గొడవకు సంబంధించి 1, కొడుకులు పట్టించుకోవడంలేదని 1, ప్లాట్ భూకబ్జాకు సంబంధించి 2, అప్పు తీసుకొని ఇవ్వడం లేదని 1, ఇతర అంశాలకు సంబంధించి 1, మొత్తం 12 ఫిర్యాదులు వచ్చాయన్నారు.

Similar News

News March 25, 2026

యుద్ధం.. కొనసాగుతున్న ఆల్ పార్టీ మీటింగ్

image

పశ్చిమాసియా యుద్ధంపై కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ అధ్యక్షతన పార్లమెంట్ భవనంలో ఆల్ పార్టీ మీటింగ్ కొనసాగుతోంది. INC, BJD, SP, CPM తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ భారత్‌పై యుద్ధ ప్రభావాన్ని వివరించారు. ప్రతిపక్ష నేతలు లేవనెత్తిన సందేహాలకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సమాధానాలిస్తున్నారు. ఇంధన సంక్షోభం నేపథ్యంలో ఈ పార్టీ మీటింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది.

News March 25, 2026

కృష్ణా: భద్రాచలానికి RTC స్పెషల్ సర్వీసులు

image

శ్రీరామ నవమి సందర్భంగా మచిలీపట్నం, ఉయ్యూరు, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం ఆర్టీసీ డిపోల నుంచి భద్రాచలం వెళ్లేందుకు ఈ నెల 26, 27న ప్రత్యేక RTC బస్సులు నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ప్రత్యేక సర్వీసులకు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా టికెట్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 25, 2026

పుట్టపర్తి కలెక్టరేట్‌‌లో డీఐపీసీ సమీక్ష

image

పుట్టపర్తి కలెక్టరేట్‌‌లో కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక అనుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐపీసీ) సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. వివిధ శాఖ ద్వారా పరిశ్రమలకు రావాల్సిన అనుమతులను మంజూరు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గతేడాది విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాల పురోగతిపై సమీక్షించారు. అవసరమైన భూమిని కేటాయించాలని ఆదేశించారు.