News October 6, 2025
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి: డీఎంహెచ్ఓ

వైద్యులు, వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ములుగు డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్ రావు అన్నారు. రాయినిగూడెం పీహెచ్సీ పరిధి మల్లంపల్లి, జాకారం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణులను గుర్తించి ప్రభుత్వ వైద్యశాలలోనే ప్రసూతి జరిగేలా చొరవ తీసుకోవాలని సూచించారు. TB, NCD నివారణకు కృషి చేయాలన్నారు.
Similar News
News March 25, 2026
పుట్టపర్తి కలెక్టరేట్లో డీఐపీసీ సమీక్ష

పుట్టపర్తి కలెక్టరేట్లో కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక అనుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐపీసీ) సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. వివిధ శాఖ ద్వారా పరిశ్రమలకు రావాల్సిన అనుమతులను మంజూరు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గతేడాది విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కుదుర్చుకున్న ఒప్పందాల పురోగతిపై సమీక్షించారు. అవసరమైన భూమిని కేటాయించాలని ఆదేశించారు.
News March 25, 2026
నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని సార్లపల్లి, కుడిచింతల బైలు గ్రామాల తరలింపు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం పునరావాస ప్యాకేజీని అందజేసింది. బుధవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వాసిత కుటుంబాలకు రూ.15 లక్షల విలువైన చెక్కులతో పాటు భూమి పత్రాలను పంపిణీ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్యుతాపురం ఎమ్మెల్యే వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
News March 25, 2026
యురేనియం నిల్వలపై క్లారిటీ ఇవ్వండి: MP బాలశౌరి

కడప జిల్లా తుమ్మలపల్లె వద్ద 4,400 టన్నుల యురేనియం నిల్వలు అదనంగా లభించాయన్న దానిపై స్పష్టత ఇవ్వాలని మచిలీపట్నం MP వల్లభనేని బాలశౌరి బుధవారం నిర్వహించిన పార్లమెంట్ సమావేశంలో కేంద్రాన్ని కోరారు. యూరేనియం నిల్వలు లభించడం వాస్తవమే అయితే అందుకు సంబంధించి వివరాలు వెల్లడించాలన్నారు. దీనిపై స్పందించిన మంత్రి 2024-25, 2025-26లో 4400 టన్నుల ఇన్-సిటు యురేనియం ఆక్సైడ్ వనరును వృద్ధి చేశామని పేర్కొన్నారు.


