News October 6, 2025
CJIపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: ప్రధాని

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR <<17928232>>గవాయ్పై దాడిని<<>> తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘దీనిపై గవాయ్ గారితో మాట్లాడాను. మన సమాజంలో అలాంటి చర్యలకు తావు లేదు. ఆ ఘటన ప్రతి భారతీయుడికి కోపం తెప్పించింది. అలాంటి క్లిష్ట సమయంలో గవాయ్ శాంతంగా ఉండటాన్ని అభినందిస్తున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News October 7, 2025
మరోసారి టారిఫ్స్ బాంబు పేల్చిన ట్రంప్

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి టారిఫ్స్ బాంబు పేల్చారు. ఇతర దేశాల నుంచి USలోకి వచ్చే అన్ని మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25% టారిఫ్ విధించనున్నట్లు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఇది ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి టారిఫ్ల మోత కొనసాగిస్తున్నారు. ఇప్పటికే భారత్ సహా పలు దేశాలపై అడిషనల్ టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే.
News October 7, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చిత్తశుద్ధితో ఉన్నాం: CM చంద్రబాబు

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ పటిష్టతకు, పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఏడాది కాలంలో కేంద్ర సాయం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్లాంట్ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి వచ్చింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ప్లాంట్ను నష్టాల నుంచి బయట పడేయడానికి, బలోపేతం చేయడానికి యాజమాన్యం, కార్మికులు, ఉద్యోగులు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి’ అని అధికారులతో సమీక్షలో వ్యాఖ్యానించారు.
News October 7, 2025
అక్టోబర్ 7: చరిత్రలో ఈరోజు

1708: సిక్కుల చివరి గురువు గురు గోవింద సింగ్ మరణం
1885: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ జననం
1940: కవి, రచయిత కూచి నరసింహం మరణం
1977: మిస్ వరల్డ్ (1999), నటి యుక్తా ముఖీ జననం
1978: భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ జననం (ఫొటోలో)
☞ ప్రపంచ పత్తి దినోత్సవం