News October 6, 2025
స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి కొనిజర్ల మండలం తనికెళ్ల గ్రెసీ కాలేజ్, ఖమ్మంలోని sr&bgnr కళాశాల, బారుగూడెంలోని మహ్మదీయ కళాశాలల నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను పరిశీలించారు.
Similar News
News March 31, 2026
నేలకొండపల్లి బౌద్ధస్తూపాన్ని అభివృద్ధి చేయాలి: ఖమ్మం ఎంపీ

నేలకొండపల్లిలోని చారిత్రక బౌద్ధస్తూపాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. లోక్సభలో 377 నిబంధన కింద ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. శాతవాహన కాలం నాటి ఈ కట్టడాన్ని ‘జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్’లో చేర్చాలని డిమాండ్ చేశారు. అక్కడ మ్యూజియం ఏర్పాటుతో పాటు మౌలిక వసతులు కల్పిస్తే విదేశీ పర్యాటకుల రాక పెరుగుతుందని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.
News March 31, 2026
నేలకొండపల్లి బౌద్ధస్తూపాన్ని అభివృద్ధి చేయాలి: ఖమ్మం ఎంపీ

నేలకొండపల్లిలోని చారిత్రక బౌద్ధస్తూపాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. లోక్సభలో 377 నిబంధన కింద ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. శాతవాహన కాలం నాటి ఈ కట్టడాన్ని ‘జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్’లో చేర్చాలని డిమాండ్ చేశారు. అక్కడ మ్యూజియం ఏర్పాటుతో పాటు మౌలిక వసతులు కల్పిస్తే విదేశీ పర్యాటకుల రాక పెరుగుతుందని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.
News March 31, 2026
ఖమ్మం: ఎస్సీ కార్పొరేషన్ దరఖాస్తుల గడువు పొడిగింపు

ఖమ్మం జిల్లాలోని ఎస్సీ అభ్యర్థులకు శుభవార్త. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 పథకాల ఆన్లైన్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 8 వరకు పొడిగించినట్లు ఈడీ నవీన్ బాబు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు tsobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఆ పత్రాలను సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఆర్థిక మద్దతు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.


