News October 7, 2025

బెస్ట్ అవైలబుల్ స్కూల్‌ విద్యార్థుల ఇబ్బంది.. కొప్పుల ఆగ్రహం

image

జగిత్యాల జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్‌లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం బయటకు పంపివేయడంపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ శాఖ మంత్రి లక్ష్మణ్ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. విద్యార్థులను వెంటనే స్కూల్స్‌లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Similar News

News October 7, 2025

తులసి పూజ సమయంలో చదవాల్సిన మంత్రం

image

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా:||
యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్||
నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే|
నమో మోక్షప్రదే దేవి నమ: సంపత్ర్పదాయిని||
ఈ మంత్రాన్ని చదువుతూ తులసి పూజ చేస్తే మాంగళ్యం చిరకాలం నిలుస్తుందని పండితులు చెబుతున్నారు. తులసి ఉన్న చోట దుష్ట శక్తులు ప్రవేశించవు. ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయి. <<-se>>#Shlokam<<>>

News October 7, 2025

ములుగు: ఎస్టీ వర్గాల మధ్య అంతర్గత చర్చలు..!

image

ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, నిరసనగా లంబాడీలు రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు చేయడం ఇటీవల హాట్ టాపిక్ అయ్యాయి. స్థానిక ఎన్నికల శంఖారావం పూరించిన తర్వాత ములుగు జిల్లాలో ఈ రెండు వర్గాలు సయోధ్య కోసం అంతర్గత చర్చలు జరుపుతున్నాయని సమాచారం. తమ జనాభా ఎక్కువగా ఉన్న చోట తమ వర్గానికే పోటీకి అవకాశం కల్పించాలని, ఇందుకోసం పరస్పరం సహకరించుకోవాలని అనుకున్నారట.

News October 7, 2025

నీట మునిగిన మిరప పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

పొలంలో నీటిని బయటకు పంపాలి. వడలిన మొక్కలకు లీటరు నీటికి 5గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. ఇనుపధాతు లోపంతో మొక్కలు పాలిపోయినట్లుంటే 10 లీటర్ల నీటికి 50గ్రా. అన్నభేదితో పాటు ఒక నిమ్మ చెక్క రసం కలిపి పిచికారీ చేయాలి. మొక్కలు తేరుకున్నాక లీటరు నీటికి 5గ్రా. స్థూలపోషకాల మిశ్రమం, లీటరు నీటికి 2.5గ్రా. సూక్ష్మపోషకాల మిశ్రమం కలిపి ఒకదాని తర్వాత ఒకటి వారం వ్యవధిలో 2,3సార్లు పిచికారీ చేయాలి.