News October 7, 2025
శిక్షణకు గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు: కలెక్టర్ హనుమంతరావు

స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరు కాని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సోమవారం తుర్కపల్లి రైతు వేదికలో ప్రొసీడింగ్ ఆఫీసర్లకు (పీఓలకు) నిర్వహించిన శిక్షణా తరగతులను ఆయన పరిశీలించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News October 7, 2025
తులసి పూజ సమయంలో చదవాల్సిన మంత్రం

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా:||
యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్||
నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే|
నమో మోక్షప్రదే దేవి నమ: సంపత్ర్పదాయిని||
ఈ మంత్రాన్ని చదువుతూ తులసి పూజ చేస్తే మాంగళ్యం చిరకాలం నిలుస్తుందని పండితులు చెబుతున్నారు. తులసి ఉన్న చోట దుష్ట శక్తులు ప్రవేశించవు. ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయి. <<-se>>#Shlokam<<>>
News October 7, 2025
ములుగు: ఎస్టీ వర్గాల మధ్య అంతర్గత చర్చలు..!

ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, నిరసనగా లంబాడీలు రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు చేయడం ఇటీవల హాట్ టాపిక్ అయ్యాయి. స్థానిక ఎన్నికల శంఖారావం పూరించిన తర్వాత ములుగు జిల్లాలో ఈ రెండు వర్గాలు సయోధ్య కోసం అంతర్గత చర్చలు జరుపుతున్నాయని సమాచారం. తమ జనాభా ఎక్కువగా ఉన్న చోట తమ వర్గానికే పోటీకి అవకాశం కల్పించాలని, ఇందుకోసం పరస్పరం సహకరించుకోవాలని అనుకున్నారట.
News October 7, 2025
నీట మునిగిన మిరప పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పొలంలో నీటిని బయటకు పంపాలి. వడలిన మొక్కలకు లీటరు నీటికి 5గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. ఇనుపధాతు లోపంతో మొక్కలు పాలిపోయినట్లుంటే 10 లీటర్ల నీటికి 50గ్రా. అన్నభేదితో పాటు ఒక నిమ్మ చెక్క రసం కలిపి పిచికారీ చేయాలి. మొక్కలు తేరుకున్నాక లీటరు నీటికి 5గ్రా. స్థూలపోషకాల మిశ్రమం, లీటరు నీటికి 2.5గ్రా. సూక్ష్మపోషకాల మిశ్రమం కలిపి ఒకదాని తర్వాత ఒకటి వారం వ్యవధిలో 2,3సార్లు పిచికారీ చేయాలి.