News October 7, 2025
ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి: నిరంజన్ రెడ్డి

బీసీల రిజర్వేషన్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తిలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అలవికాని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News October 7, 2025
IPOకు లలితా జ్యువెలరీ

రూ.1700 కోట్ల సమీకరణ లక్ష్యంగా లలితా జ్యువెలరీ మార్ట్ PVT Ltd త్వరలో IPOకు రానుంది. ఇందులో ఫ్రెష్ ఈక్విటీ షేర్లతో రూ.1200 కోట్లు, ప్రమోటర్ కిరణ్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.500 కోట్ల విలువైన షేర్స్ సెల్ చేయనుంది. పబ్లిక్ ఇష్యూ కోసం జూన్లోనే సెబీకి అప్లై చేయగా ఇటీవల గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ చెన్నై బేస్డ్ కంపెనీకి తమిళనాడులో 2 మాన్యూఫ్యాక్చర్ యూనిట్స్, సౌత్ సహా దేశంలో 56 బ్రాంచిలు ఉన్నాయి.
News October 7, 2025
KNR: హైకోర్టు తీర్పుపై ఆశావహుల్లో ఉత్కంఠ..!

SEC స్థానిక పోరుకు షెడ్యూల్ విడుదల చేసింది. BCలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వ GOను సవాల్ చేస్తూ కొందరు హై, సుప్రీం కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నిన్న సుప్రీం కోర్టులో రిజర్వేషన్లపై విచారణ జరిపేందుకు న్యాయమూర్తులు నిరాకరించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. దీంతో ఉమ్మడి KNRలోని ఆశావహులు హైకోర్టు తీర్పు కోసం ఉత్కంఠతో చూస్తున్నారు.
News October 7, 2025
నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో ఉద్యోగాలు

నేషనల్ హౌసింగ్ బ్యాంక్ 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు ఉన్నాయి పోస్టును బట్టి CA, MBA, PGDM, PGDBM, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175. వెబ్సైట్: https://www.nhb.org.in/