News October 7, 2025

అలా చేస్తేనే రోహిత్, కోహ్లీ టీమ్‌లో ఉంటారు: ABD

image

2027 ODI WC టీమ్‌లో చోటు దక్కాలంటే రోహిత్, కోహ్లీ పరుగులు చేయాల్సిందేనని SA మాజీ క్రికెటర్ డివిలియర్స్ అన్నారు. ‘WC వరకు రోహిత్, కోహ్లీ జట్టులో ఉంటారన్న గ్యారంటీ లేదు. అందుకే గిల్‌ను కెప్టెన్ చేశారు. ఇది సరైన నిర్ణయమే. వారిద్దరి నుంచి అతడు నేర్చుకునే అవకాశం ఉంటుంది. టీమ్ ఇండియాలో కాంపిటిషన్ ఎక్కువ కాబట్టి రోహిత్, కోహ్లీ రన్స్ చేయక తప్పదు. వారు రాణిస్తారనే నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.

Similar News

News October 7, 2025

బండి నడుపుతూ పాటలు వింటున్నారా?

image

TG: వాహనాలు నడుపుతూ ఫోన్‌లో వీడియోలు చూసేవారికి, హెడ్ ఫోన్‌లో పాటలు వినే వారికి హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అది చాలా ప్రమాదకరం అని, ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆటో, క్యాబ్/బైక్ ట్యాక్సీ డ్రైవర్లకు ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు పూర్తి ఏకాగ్రత దానిపైనే పెట్టాలని సూచించారు.

News October 7, 2025

ఒకే వ్యక్తికి 1,638 క్రెడిట్ కార్డులు.. మీకు తెలుసా?

image

అత్యధిక(1,638) వాలిడ్ క్రెడిట్ కార్డులున్న వ్యక్తిగా భారత్‌కు చెందిన మనీశ్ ధామేజా పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డు ఉంది. తనకు క్రెడిట్ కార్డ్స్ ఇష్టమని, వాటి ద్వారా వచ్చే రివార్డ్స్, బెనిఫిట్స్ అద్భుతమని ఆయన పేర్కొన్నారు. పాత నోట్ల రద్దు సమయంలో అవి చాలా ఉపయోగపడ్డాయన్నారు. ఇదే కాకుండా 10L+ నాణేలు సేకరించిన గిన్నిస్ రికార్డు కూడా ఆయన సొంతం. కాగా ఓ వ్యక్తి దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డులైనా ఉండవచ్చు.

News October 7, 2025

విజయ్ దేవరకొండకు ప్రమాదం.. రష్మిక వల్లేనని పసలేని కామెంట్స్!

image

సినీ హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరగడానికి రష్మికే కారణమని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎంగేజ్‌మెంట్ జరిగిన రెండు రోజులకే ప్రమాదం జరిగిందని, రష్మికది ఐరన్ లెగ్ అని అంటున్నారు. కాగా అవి పసలేని వాదనలంటూ మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. విజయ్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటానికి రష్మికే కారణమని పాజిటివ్‌గా థింక్ చేయొచ్చుగా అని సలహాలిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?