News October 7, 2025
సైబర్ వలలో మోసపోయిన రైతు

సైబర్ నేరగాళ్లు రాయదుర్గం రైతు పాటిల్ ఎర్రితాతను బురిడీ కొట్టించారు. కణేకల్లు మండలం తుంబిగనూరుకు చెందిన ఆయన ఇటీవల సజ్జలు విక్రయించడంతో ఖాతాలో డబ్బులు జమయ్యాయి. ఈ క్రమంలో సైబర్ కేటుగాళ్లు పాటిల్ ఖాతాలోని రూ.75 వేలను మాయం చేశారు. అకౌంట్లో డబ్బులు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో బ్యాంకు ప్రతినిధులను సంప్రదించారు. సైబర్ మోసమని తెలుసుకుని రాయదుర్గం పీఎస్లో ఫిర్యాదు చేశారు.
Similar News
News March 10, 2026
రజినీ-కమల్ మల్టీస్టారర్ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి సందర్భంగా మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించనుండగా, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించనుంది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ఈ మూవీ <<19199837>>ప్రోమో<<>> ఆడియన్స్ను ఆకట్టుకుంది.
News March 10, 2026
కృష్ణా: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో జిల్లాలో విద్యార్థుల సౌకర్యార్థం APSRTC ఉచిత BUS సర్వీస్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షల రోజుల్లో విద్యార్థులు తమ నివాస ప్రాంతం నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లి తిరిగి రావడానికి హాల్ టికెట్ చూపించి అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఎటువంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు.
News March 10, 2026
NZB: ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉంది: TPCC చీఫ్

ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం నగరంలోని ఖిలా రోడ్లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన అధికారిక ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం మైనారిటీల కోసం విద్య, ఉపాధి రంగాల్లో అనేక పథకాలను, షాదీ ముబారక్’ పథకాన్ని పకడ్బందీగా అమల చేస్తోందన్నారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.


