News October 7, 2025

HYD: TGPSC సభ్యులుగా ఇద్దరు ఐపీఎస్ అధికారులు

image

G.O. Ms. No.198 ప్రకారం ఐపీఎస్ అధికారులు చంద్రకాంత్ రెడ్డి, విశ్వప్రసాద్‌ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమితులై సోమవారం HYDలోని కార్యాలయంలో విధులు చేపట్టారు. TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలో వారు బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రోగ్రాంలో కమిషన్ సభ్యులు అమీరుల్లా ఖాన్, ప్రొ.యదయ్య, పళవై రాజానీ కుమారి, ప్రొ.లక్ష్మీకాంత్ రాథోడ్, సెక్రటరీ డా.ప్రియాంక పాల్గొన్నారు.

Similar News

News March 15, 2026

డ్రగ్స్ వివాదంలో ‘పైలట్ రోహిత్’!

image

డ్రగ్స్ వినియోగిస్తారనే ఆరోపణలు పైలట్ రోహిత్ రెడ్డిపై వస్తూనే ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ కేసులో బెంగళూర్ పోలీసులు విచారణకు పిలిచారు. ఇప్పుడు తన ఫాంహౌస్‌లోనే డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ దొరికిపోయారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇదే ఫాంహౌస్ వేదికగా జరిగింది. ఇప్పుడు డ్రగ్స్ పార్టీకి కూడా ఇదే వేదిక. దీంతో పైలట్‌తో పాటు ఆయన ‘ఫౌంహౌస్‌’ కూడా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

News March 15, 2026

డ్రగ్స్ వివాదంలో ‘పైలట్ రోహిత్’!

image

డ్రగ్స్ వినియోగిస్తారనే ఆరోపణలు పైలట్ రోహిత్ రెడ్డిపై వస్తూనే ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ కేసులో బెంగళూర్ పోలీసులు విచారణకు పిలిచారు. ఇప్పుడు తన ఫాంహౌస్‌లోనే డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ దొరికిపోయారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఇదే ఫాంహౌస్ వేదికగా జరిగింది. ఇప్పుడు డ్రగ్స్ పార్టీకి కూడా ఇదే వేదిక. దీంతో పైలట్‌తో పాటు ఆయన ‘ఫౌంహౌస్‌’ కూడా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

News March 15, 2026

BREAKING: ఖమ్మం: విద్యుత్ షాక్‌తో పంచాయతీ సెక్రటరీ మృతి

image

కరెంటు షాక్ తగిలి పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన విషాద ఘటన ఉదయం కారేపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఏన్కూరు మండలం తిమ్మారావుపేట కార్యదర్శిగా పనిచేస్తున్న సురేష్ కారేపల్లిలోని తన నివాసంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆయన స్వగ్రామంతో పాటు విధులు నిర్వర్తిస్తున్న గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.