News October 7, 2025
అనకాపల్లి: జిల్లాస్థాయి అధికారులకు అవార్డులు

స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పలువురు జిల్లాస్థాయి అధికారులకు అవార్డులు లభించాయి. జిల్లా రెవిన్యూ అధికారి సత్యనారాయణ రావు, జిల్లా పంచాయతీ అధికారి సందీప్, ఏఎస్పీ మోహనరావుకు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 3, 2026
₹167కోట్లు!.. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్

రాజా రవివర్మ పెయింటింగ్స్లో ఒకటైన ‘యశోద-కృష్ణ’ వేలంలో ఏకంగా ₹167.20కోట్లు పలికింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండీ సైరస్ పూనావాలా దీనిని దక్కించుకున్నారు. ఎంఎఫ్ హుసేన్ ‘గ్రామ్ యాత్ర’ పెయింటింగ్ రికార్డ్ను (₹118Cr) బ్రేక్ చేసి దేశంలోనే ఖరీదైన చిత్రంగా నిలిచింది. ఈ ఆయిల్ పెయింటింగ్ను రవివర్మ 1890ల్లో గీశారు. యశోద ఆవు పాలు పితుకుతుంటే బాలకృష్ణుడు పాత్రతో చేయిచాస్తున్నట్టుగా ఈ చిత్రం ఉంది.
News April 3, 2026
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ

సైబర్ నేరాల పట్ల విశ్రాంత ఉద్యోగులు, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సైబర్ క్రైమ్ డీఎస్పీ జి. శ్రీనివాస్ సూచించారు. సైబర్ జాగ్రూక్త దివాస్ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ ఫర్ సీనియర్ సిటిజన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు, సిద్దిపేట ప్రజలు పాల్గొన్నారు.
News April 3, 2026
నిర్మల్: సీఎం పర్యటన.. కలెక్టర్ దిశానిర్దేశం

ముఖ్యమంత్రి బాసర పర్యటనకు ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సీఎం బాసర చేరుకున్న నుంచి, ఆలయ సందర్శన, పూజలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, తిరిగి వెళ్లేవరకు వివిధ శాఖల అధికారులు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. హెలిప్యాడ్, ఆలయం లోపల, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలన్నారు.


