News October 7, 2025

ADB: దామిని యాప్ వాడుదాం

image

భారీ వర్షాలే కాదు.. పిడుగు పాట్లు ఉమ్మడి ADBకు తీరని లోటును మిగిల్చాయి. ఇటీవల పిడుగుపాటుతో ADBలో ఇద్దరు మృతి చెందగా.. మామడలో ఆలయంపై పిడుగు పడి కొంత మేర ధ్వంసమైంది. ASFలో పశువులు మరణించాయి. వానాకాలం ప్రారంభం నుంచి ఉమ్మడి ADBలో 15+ మంది మరణించారు. పిడుగులను గుర్తించేలా కేంద్ర ప్రభుత్వం దామీని యాప్ తీసుకొచ్చింది. ఇది పిడుగులను గుర్తించి మనల్ని అలర్ట్ చేస్తుంది.
SHARE IT

Similar News

News March 21, 2026

మంచిర్యాల: ఆర్టీసీ ద్వారా రాములోరి తలంబ్రాలు

image

భద్రాది శ్రీ రాములవారి తలంబ్రాలు ఆర్టీసీ కార్గో ద్వారా అందజేస్తామని MNCL డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం దీనికి సంబంధించిన కరపత్రాలను డిపో వద్ద ఆవిష్కరించారు. కార్గో ద్వారా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్నామని, మేడారం సమ్మక్క సారలమ్మ బంగారాన్ని (బెల్లం) కూడా అందజేసినట్లు తెలిపారు. శ్రీరాములోరి తలంబ్రాల కోసం ఆర్టీసీ కార్గోను సంప్రదించాలని కోరారు.

News March 21, 2026

NLG: సాగునీటి వివక్షపై సీపీఐ పోరు!

image

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై సీపీఐ సమరశంఖం పూరించింది. ముఖ్యంగా డిండి ప్రాజెక్టు నిర్మాణంలో ప్రదర్శిస్తున్న వివక్షను ఎండగడుతూ భారీ ఉద్యమాలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 1, 2 తేదీలలో బీసీ టన్నెల్, ఏదుల రిజర్వాయర్ ప్రాజెక్టులను సీపీఐ బృందం సందర్శించి వాస్తవాలను పరిశీలించనుంది. ఏప్రిల్ 5న అఖిలపక్ష సదస్సును నిర్వహించనున్నారు.

News March 21, 2026

మధిర: 9 పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు రంగం సిద్ధం

image

మధిర నియోజకవర్గంలో రానున్న విద్యా సంవత్సరం నుంచి 5 మండలాల్లో 9 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పాఠశాలలో 800–1000 మంది విద్యార్థులు చదివేలా ప్రణాళిక రూపొందించారు. ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని, ముదిగొండ మండలాల్లో ఈ స్కూల్స్ ఏర్పాటవుతాయి. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు బోధన అందించనున్నారు. విద్యార్థులను సమీప గ్రామాల నుంచి రవాణా ద్వారా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.