News October 7, 2025

HYD: జాతీయ పార్టీలు ఆలస్యమెందుకు..?

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూనే ఇప్పుడు తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. కాగా ప్రాంతీయ పార్టీ అయిన BRS అందరి కంటే ముందే అభ్యర్థిని ప్రకటించి క్షేత్రస్థాయిలో ప్రచారంలోకి దిగిందని, జాతీయ పార్టీలైనా కాంగ్రెస్, BJP మాత్రం ఇంకా ఆలస్యమెందుకు చేస్తున్నాయో అర్థంకావడం లేదని స్థానికంగా చర్చ సాగుతోంది. అయితే బలమైన అభ్యర్థుల కోసం అధిష్ఠానాలు చూస్తున్నాయని ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News October 7, 2025

‘EPC-టర్న్‌కీ’ విధానంలో ప్యారడైజ్-శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్

image

ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ ORR వరకు 18 KMల 6-లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని అత్యంత కఠినమైన ‘EPC-టర్న్‌కీ’ విధానంలో HMDA చేపట్టనుంది. ఈ విధానంలో డిజైన్ నుంచి నిర్మాణం, ఆలస్యం రిస్క్ మొత్తం కాంట్రాక్టర్‌దే. గంటకు 100KM వేగంతో ప్రయాణించేలా నిర్మించాల్సిన ఈప్రాజెక్టును కేవలం 24నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించారు. ఇందులో At-గ్రేడ్ రోడ్ సెక్షన్ ఉండే 6.522 KMపొడవైన టన్నెల్ నిర్మాణం ముఖ్య భాగం.

News October 7, 2025

HYD: బీజేపీ గుప్పిట్లో ‘కీలకమైన ఏడుగురు’..?

image

జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో వీవీఐపీ మధ్య యుద్ధానికి తెరపడనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీబీజేపీ చీఫ్ ఎన్.రామచందర్‌రావు వద్ద ఉన్న కీలక జాబితాల నుంచి ఏడుగురు బలమైన అభ్యర్థులను బీజేపీ వడపోసినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ సీటును పార్టీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుందో చెప్పడానికి, అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఏకంగా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడమే నిదర్శనం.

News October 7, 2025

జూబ్లీహిల్స్ బైపోల్.. BRS గెలుస్తుందా?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్‌పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతకే టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ అభివృద్ధి చేస్తున్నామని ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు KCR వైపే ఉన్నారని, తామే విజయం సాధిస్తామని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కంటోన్మెంట్లో జరిగిన ఉపఎన్నికలో సత్తా చాటని ‘కారు’ ఈ ఎన్నికలోనైనా స్పీడ్ పెంచుతుందో లేదో చూడాలి.