News October 7, 2025
HYD: జాతీయ పార్టీలు ఆలస్యమెందుకు..?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూనే ఇప్పుడు తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. కాగా ప్రాంతీయ పార్టీ అయిన BRS అందరి కంటే ముందే అభ్యర్థిని ప్రకటించి క్షేత్రస్థాయిలో ప్రచారంలోకి దిగిందని, జాతీయ పార్టీలైనా కాంగ్రెస్, BJP మాత్రం ఇంకా ఆలస్యమెందుకు చేస్తున్నాయో అర్థంకావడం లేదని స్థానికంగా చర్చ సాగుతోంది. అయితే బలమైన అభ్యర్థుల కోసం అధిష్ఠానాలు చూస్తున్నాయని ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News October 7, 2025
పీలేరులో పతాకస్థాయికి MLA పీఏ భూకబ్జాలు: YCP

పీలేరు <<17935208>>MLA కిషోర్ కుమార్ పీఏ<<>> సత్య తన భూమిని కబ్జా చేశారని అనురాధ అనే మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరవర్గం భారీగా కబ్జాలు చేస్తోంది. పీలేరులో ఎమ్మెల్యే పీఏ భూకబ్జాలు పతాకస్థాయికి చేరాయి. ఈ 15 నెలల్లో ఇసుక, లిక్కర్లో దోచుకుంది మీ వాళ్లకి సరిపోలేదా చంద్రబాబు?’ అంటూ YCP ట్వీట్ చేసింది.
News October 7, 2025
పాయకరావుపేట: తీరానికి కొట్టుకొచ్చిన విద్యార్థి మృతదేహం

పాయకరావుపేట మండలం పాల్మాన్పేట సముద్ర తీరంలో సోమవారం సాయంత్రం గల్లంతయిన పాలిటెక్నిక్ విద్యార్థి అశోక్ (19) మృతదేహం లభ్యమయింది. మంగళవారం ఉదయం అదే మండలం కొర్లయ్యపేట సముద్రతీరానికి కొట్టుకు వచ్చింది. స్థానిక మత్స్యకారులు సమాచారాన్ని మెరైన్ పోలీసులకు అందజేశారు. సముద్ర స్థానం చేసి బయటకు వస్తుండగా పెద్ద కెరటం వచ్చి అశోక్ను లోపలికి లాక్కుపోవడంతో గల్లంతయిన విషయం తెలిసిందే.
News October 7, 2025
JGTL: నిరుపేద విద్యార్థులకు భారంగా మారిన విద్య

JGTL పట్టణంలోని శ్రీ చైతన్య జాబితాపూర్, చుక్కారామయ్య సహా పలు ప్రభుత్వ పాఠశాలల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం ద్వారా పేద విద్యార్థులకు విద్యనందిస్తున్నారు. కాగా, ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫీజుల బిల్లులు రాలేదని విద్యార్థులను లోపలికి రానీయకుండా బయటికు పంపేశారు. కలెక్టరేట్కు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లినా తిరస్కరించారని, రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు.