News October 7, 2025
KNR: హైకోర్టు తీర్పుపై ఆశావహుల్లో ఉత్కంఠ..!

SEC స్థానిక పోరుకు షెడ్యూల్ విడుదల చేసింది. BCలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వ GOను సవాల్ చేస్తూ కొందరు హై, సుప్రీం కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నిన్న సుప్రీం కోర్టులో రిజర్వేషన్లపై విచారణ జరిపేందుకు న్యాయమూర్తులు నిరాకరించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. దీంతో ఉమ్మడి KNRలోని ఆశావహులు హైకోర్టు తీర్పు కోసం ఉత్కంఠతో చూస్తున్నారు.
Similar News
News October 7, 2025
JGTL: నిరుపేద విద్యార్థులకు భారంగా మారిన విద్య

JGTL పట్టణంలోని శ్రీ చైతన్య జాబితాపూర్, చుక్కారామయ్య సహా పలు ప్రభుత్వ పాఠశాలల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం ద్వారా పేద విద్యార్థులకు విద్యనందిస్తున్నారు. కాగా, ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫీజుల బిల్లులు రాలేదని విద్యార్థులను లోపలికి రానీయకుండా బయటికు పంపేశారు. కలెక్టరేట్కు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లినా తిరస్కరించారని, రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు.
News October 7, 2025
ఎన్ని ఓట్లు తొలగించారో చెప్పే ధైర్యం CECకి లేదు: కాంగ్రెస్

బిహార్లో ఎన్ని నాన్ సిటిజెన్స్ ఓట్లను తొలగించారో వెల్లడించే ధైర్యం CECకి లేదని CONG ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మండిపడ్డారు. ‘SIRలో పౌరులు కాని వ్యక్తుల పేరిట ఉన్న ఓట్లను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా తొలగించిన ఓట్ల లెక్కల్ని దేశ ప్రజలకు తెలిసేలా బయటపెట్టాలి. ఎన్నికల సంఘం ఆ పని మాత్రం చేయడం లేదు’ అని Xలో విమర్శించారు. కాగా బిహార్ SIRపై తమ అనాలసిస్ను జైరామ్ రమేశ్ Xలో పోస్టు చేశారు.
News October 7, 2025
HYD: బీజేపీ గుప్పిట్లో ‘కీలకమైన ఏడుగురు’..?

జూబ్లీహిల్స్ బైపోల్లో వీవీఐపీ మధ్య యుద్ధానికి తెరపడనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీబీజేపీ చీఫ్ ఎన్.రామచందర్రావు వద్ద ఉన్న కీలక జాబితాల నుంచి ఏడుగురు బలమైన అభ్యర్థులను బీజేపీ వడపోసినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ సీటును పార్టీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుందో చెప్పడానికి, అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఏకంగా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడమే నిదర్శనం.