News October 7, 2025

ఇంజినీరింగ్ అర్హతతో 2,570 పోస్టులు

image

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(RRB)2,570 పోస్టులకు ఈనెల 31 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ఇంజినీరింగ్ అర్హతగల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష(CBT-1, CBT-2), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఇప్పటినుంచే ప్రిపరేషన్ కొనసాగిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in

Similar News

News October 7, 2025

వాల్మీకి గురించి మనకు తెలియని మరో కథ

image

ఓ బోయవాడు క్రౌంచపక్షి జంటలో ఒకదాన్ని చంపడం చూసి వాల్మీకి చలించిపోతాడు. అసంకల్పితంగా ఓ శ్లోకాన్ని పలుకుతాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై.. ఆ శ్లోకమే రామాయణానికి మూలం అవుతుందని చెబుతాడు. పాత్రల సంభాషణలు, మనోగతాలు స్పష్టంగా తెలుసుకునే వరం ఇస్తాడు. ఆ వరం మేరకు వాల్మీకి ధ్యానంలో కూర్చొంటాడు. ఎలాంటి కల్పితం లేకుండా 24K శ్లోకాలతో మహాకావ్యాన్ని రచించి, లోకానికి ఆదికావ్యాన్ని అందించాడు. నేడు ఆయన జయంతి.

News October 7, 2025

PM మోదీ ఆసక్తికర పోస్ట్

image

తాను 2001లో ఇదే రోజు మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘నా తోటి భారతీయుల నిరంతర ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. నేను ప్రభుత్వ అధిపతిగా 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, దేశ పురోగతికి తోడ్పడటానికి నేను నిరంతరం ప్రయత్నిస్తున్నాను. మీ మద్దతుకు కృతజ్ఞతలు’ అని తన ఫొటోలను షేర్ చేశారు.

News October 7, 2025

ప్రైవేటు ఉద్యోగులకు ‘రైట్ టు డిస్కనెక్ట్’ కావాల్సిందేనా?

image

గ్లోబల్ లైఫ్-వర్క్ బ్యాలెన్స్ ఇండెక్స్-2025లో 42వ స్థానంలో ఉన్న భారత్‌లో ఉద్యోగుల పని భారం చర్చనీయాంశమైంది. దీనికి పరిష్కారంగా కుటుంబంతో ఉన్నప్పుడు వర్క్ కాల్స్, మీటింగ్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండేందుకు వీలు కల్పించే ‘రైట్ టు డిస్కనెక్ట్’ బిల్లును కేరళ ఎమ్మెల్యే జయరాజ్ ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఇలాంటి బిల్లును తీసుకురావాలనే చర్చ జరుగుతోంది. దీనిపై మీరేమంటారు?