News October 7, 2025
వరంగల్: నిర్దేశించిన సమయంలో షాపుల మూసివేత

శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాలు, చోరీల నియంత్రణకై వరంగల్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కమిషనరేట్ పరిధిలో నిర్దేశించిన సమయంలోనే దుకాణాలను మూయించేందుకు పోలీస్ అధికారులు పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. సీపీ ఆదేశాలతో దుకాణాలను సమయానికి మూయించేస్తున్నారు.
Similar News
News March 11, 2026
భారత్కు తొలి టెస్ట్ విజయం అందించింది ఈయనే

భారత్కు తొలి టెస్ట్ విజయాన్ని(1952లో ENGపై) అందించిన కెప్టెన్ విజయ్ హజారే జన్మదినం నేడు. 1915లో సాంగ్లీ(MH)లో జన్మించారు. IND తరఫున 30 టెస్టుల్లో 2192 రన్స్, 20W తీశారు. 14 టెస్టులకు కెప్టెన్సీ చేశారు. FCలో 238 మ్యాచుల్లో 18,740R, 595W సాధించారు. FCలో 2 ట్రిపుల్ సెంచరీలు, ఒకే టెస్టులో 2 సెంచరీలు చేసిన తొలి IND ప్లేయర్ ఆయనే. కేంద్రం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించింది. ఆయన పేరిట టోర్నీ నిర్వహిస్తోంది.
News March 11, 2026
MDK: నాగ్సాన్పల్లి శివారులో మహిళ హత్య..?

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి శివారులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలిలా.. కొడుపాక గ్రామానికి చెందిన బ్యాగరి సులోచన(35) సోమవారం కూలీ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం చెలిమకుంట వద్ద ఆమె మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ముఖంపై కర్రతో దాడి చేసిన గాయాలు ఉండడంతో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు.
News March 11, 2026
నంద్యాల: ‘పచ్చని’ ప్రమాదమంటే ఇదే!

నంద్యాల జిల్లాలో విద్యుత్ స్తంభాలకు పలుచోట్ల పిచ్చి మొక్కలు అల్లుకొని ప్రమాదకరంగా ఉన్నాయి. మేత కోసం వెళ్లి జంతువులు మృత్యువాత పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రజలు సైతం ప్రమాదాల బారిన పడ్డారు. వెలుగోడులోని జమ్మి నగర్ సమీపాన రామసముద్రం చెరువు వైపు వెళ్లే ప్రధాన రహదారి పక్కనున్న విద్యుత్ స్తంభం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదకరంగా మారింది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు మీ ప్రాంతంలో ఉన్నాయా? కామెంట్


