News October 7, 2025
ఎనుమాముల మార్కెట్లో పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారంతో పోలిస్తే నేడు మిర్చి ధరలు పెరిగాయి. సోమవారం తేజా మిర్చి(ఏసీ) క్వింటాకు రూ.14,350 ధర పలకగా.. ఈరోజు రూ.14,550కి చేరింది. 341 రకం మిర్చి(ఏసీ)కి నిన్న రూ.14,500 ధర వస్తే.. నేడు రూ.15,300 అయింది. మరోవైపు, వండర్ హాట్(WH) ఏసీ మిర్చికి నిన్న రూ.15,500 ధర రాగా.. నేడు రూ.16వేలు అయినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
Similar News
News October 7, 2025
సంగారెడ్డి: వాల్మీకి ఇచ్చే నిజమైన నివాళి అదే: SP

వాల్మీకి జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి అశోక్ మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. వాల్మీకి రచించిన రామాయణం సత్యం, అహింసను బోధిస్తుందని పేర్కొన్నారు. వాల్మీకి మార్గంలో నడవడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
News October 7, 2025
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో వాల్మీకి జయంతి

వాల్మీకి జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంగళవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ.. వాల్మీకి చూపిన మార్గంలో నేటి యువత నడవాలని కోరారు. భారత సాంస్కృతిక వారసత్వానికి రామాయణం ఆధారం అయిందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ సహాయ సంక్షేమ అధికారిణి అమర జ్యోతి, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
News October 7, 2025
చిత్తూరు: ధరలు తగ్గింపు పై అవగాహన కల్పించాలి

సూపర్ జీఎస్టీతో తగ్గిన ధరలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం ఆదేశించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తాగునీటి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.