News October 7, 2025
ఈ చిన్నారుల మరణానికి కారణమెవరు?

కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ తాగి పిల్లలు చనిపోయిన కేసులో అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. తయారీ కంపెనీకి విచ్చలవిడిగా అనుమతులిచ్చిన మధ్యప్రదేశ్ అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. తమిళనాడుకు చెందిన సిరప్ కంపెనీ ‘శ్రీసన్’ నిబంధనలు పాటించలేదని తేలింది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టీపట్టనట్లుగా ఉండటానికి కారణమేంటనే ప్రశ్నలు తలెత్తాయి. తరచూ తనిఖీలు చేస్తే ఇలా జరిగేది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.
Similar News
News October 7, 2025
ఫిజిక్స్లో ముగ్గురికి నోబెల్

ఫిజిక్స్లో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్-2025 బహుమతి దక్కింది. జాన్ క్లార్క్, మైకేల్ డెవోరెట్, జాన్ మార్టినిస్ను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ‘మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్’ కనుగొన్నందుకు వారికి నోబెల్ దక్కింది.
News October 7, 2025
ఇది BJP, BRS కుట్ర: పొన్నం

TG: మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో <<17937013>>వివాదంపై<<>> మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తాను ఎవరినీ ఏమీ అనలేదని, తన మాటలను వక్రీకరించారని మీడియాతో అన్నారు. ఇది బీఆర్ఎస్, బీజేపీ కుట్ర అని ఆరోపించారు. దీనిపై అధిష్ఠానం దృష్టి సారించిందని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్తో మాట్లాడినట్లు చెప్పారు.
News October 7, 2025
‘కాళేశ్వరం’ రిపోర్టు.. హైకోర్టులో విచారణ వాయిదా

TG: కాళేశ్వరం కమిషన్ నివేదికపై దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ మాజీ సీఎం KCR, హరీశ్ రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఇటీవల ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం ఇవాళ 2 వారాల గడువు కోరింది. దీంతో తదుపరి విచారణను వచ్చే నెల 12కి కోర్టు వాయిదా వేసింది.