News October 7, 2025
సిద్దిపేట: వాల్మీకి జయంతి వేడుకల్లో కలెక్టర్

సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో కలెక్టర్ కె.హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ రోజును జాతి గుర్తుంచుకోవాలని, ప్రపంచం ఉన్నంతవరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
Similar News
News October 7, 2025
AIలో సత్తా చాటి.. PM చేతుల మీదుగా అవార్డు

ఖమ్మం జిల్లాకు చెందిన తాళ్లూరి పల్లవి AI ఆల్ ఇండియా ట్రేడ్ టాపర్గా ఎంపికై ప్రధాని చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. యువతలో స్కిల్డెవలప్మెంట్, ఉద్యోగ నైపుణ్యాల్ని పెంచేందుకు PM-SETU పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా అత్యుత్తమ నైపుణ్యం కనపరిచిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. పల్లవి AI న్యూట్రిషన్ అసిస్టెంట్ను తయారు చేశారు. వ్యక్తిగత డైట్ను అందించడంలో ఇది సహకరిస్తుంది.
News October 7, 2025
ఏలూరు: కలెక్టరేట్లో మహర్షి వాల్మీకి జయంతి

ఏలూరు కలెక్టరేట్లోని గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ కె. వెట్రిసెల్వి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేశారు, జ్యోతి ప్రజ్వలన చేశారు. వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలు, ఏడు కాండములతో కూడిన అద్భుత రామాయణాన్ని మానవాళికి అందించారని కలెక్టర్ కొనియాడారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని వాల్మీకి జీవిత చరిత్ర మనకు తెలియజేస్తుందని ఆమె అన్నారు.
News October 7, 2025
గుడులపై ఉన్న శ్రద్ధ బడులపై లేదెందుకు: షర్మిల

AP: విశాఖ KGHలో చికిత్స పొందుతున్న <<17923468>>గురుకులాల<<>> పిల్లలను చూస్తే కడుపు తరుక్కుపోతుందని APCC చీఫ్ షర్మిల పేర్కొన్నారు. వారి శరీరాలు చూస్తే ఏం ఆహారం పెడుతున్నారో కానీ సోమాలియా దేశ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి గుడులపై ఉన్న శ్రద్ధ బడులపై లేదని దుయ్యబట్టారు. ముగ్గురు గిరిజన బిడ్డల ప్రాణాలు పోయినందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.